బీసీసీఐ సీరియస్..ముగ్గురిపై చర్యలు..
ABN, Publish Date - Apr 18 , 2025 | 11:45 AM
జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు టీం ఇండియా వెళ్లనుంది. దీనికి ఇంకా రెండు నెలల టైం ఉంది. ఈ నేపథ్యంలో కోచింగ్ బృందంలో మార్పులకు శ్రీకారుం చుట్టింది. ఈ క్రమంలో బీసీసీఐ ముగ్గురిపై వేటు వేసింది.
ముంబై: బోర్డర్ గవాస్కర్ ట్రోపీ (Border Gavaskar Trophy)లో టీమిండియా (Team India) పేలవ ప్రదర్శనపై ముగ్గురిపై బీసీసీఐ (BCCI) చర్యలు తీసుకుంది. గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) బృందంలో కీలక వ్యక్తులపై వేటు పడింది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar)పై వేటు వేయగా.. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ (Dilip), కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ (Soham Desai)ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన లీకులతో పాటు పేలవ ప్రదర్శనపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.
Also Read..: భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు
జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు టీం ఇండియా వెళ్లనుంది. దీనికి ఇంకా రెండు నెలల టైం ఉంది. ఈ నేపథ్యంలో కోచింగ్ బృందంలో మార్పులకు శ్రీకారుం చుట్టింది. ఈ క్రమంలో బీసీసీఐ ముగ్గురిపై వేటు వేసింది. గత బోర్డర్ గవాస్కర్ ట్రోపీని టీం ఇండియా 1-3 తేడాతో కోల్పోయింది. అంతకుముందు న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలోనే భారత్కు చుక్కెదురైంది. పేలవ ప్రదర్శనను కారణంగా చూపిస్తూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
టెక్సాస్లో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి...
For More AP News and Telugu News
Updated Date - Apr 18 , 2025 | 11:45 AM