ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Governor BC Reservation: బీసీలకు రిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌పై న్యాయసలహా!

ABN, Publish Date - Jul 19 , 2025 | 03:54 AM

రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ న్యాయసలహా కోరినట్టు తెలిసింది.

  • అధికారులతో చర్చించిన తర్వాత కోరిన గవర్నర్‌

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ న్యాయసలహా కోరినట్టు తెలిసింది. రిజర్వేషన్‌ అమలుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లో సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌ ఫైలులో కదలిక వచ్చింది. ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రాజ్‌భవన్‌లో అధికారులతో శుక్రవారం చర్చించినట్టు సమాచారం. అంతేకాక, ఈ ఆర్డినెన్స్‌, రిజర్వేషన్‌ అంశాలపై గవర్నర్‌ న్యాయ సలహా కోరినట్టు తెలిసింది.

రిజర్వేషన్లు, వాటి అమలుకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పలు వివరాలు తీసుకోవాలని సంబంధిత అధికారులను గవర్నర్‌ ఈ సందర్భంగా ఆదేశించినట్టు సమాచారం. అలాగే, ప్రభుత్వం సవరణకు ప్రతిపాదించిన పంచాయతీ రాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 285 (ఏ)పై కూడా గవర్నర్‌ ఆరా తీసినట్టు తెలిసింది. కాగా, ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం లభిస్తే చట్ట సవరణ అమలులోకి రానుంది.

Updated Date - Jul 19 , 2025 | 03:54 AM