నిస్సాంక భారీ శతకం శ్రీలంక 368 4
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:05 AM
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు దీటుగా బదులిస్తోంది. ఓపెనర్ పథుమ్ నిస్సాంక (187) భారీ శతకం సాధించగా, మూడో రోజు...
గాలె: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు దీటుగా బదులిస్తోంది. ఓపెనర్ పథుమ్ నిస్సాంక (187) భారీ శతకం సాధించగా, మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో లంక 368/4 పరుగులతో నిలిచింది. చాందిమల్ (54)తో కలిసి రెండో వికెట్కు నిస్సాంక 157 పరుగులు జోడించాడు. కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న ఏంజెలో మాథ్యూస్ (39) ఫర్వాలేదనిపించగా.. క్రీజులో కమిందు మెండిస్ (37 బ్యాటిం గ్), ధనంజయ (17 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు బంగ్లా మొదటి ఇన్నింగ్స్లో 495 పరుగులకు ఆలౌటైంది. ఫెర్నాండోకు నాలుగు.. రత్నాయకె, థరిండులకు మూడేసి వికెట్లు దక్కాయి.
ఇవి కూడా చదవండి:
బుమ్రాతో అలాంటి పని మాత్రం చేయించొద్దు.. టీమిండియాకు గంగూలీ సూచన
టీమిండియాకు కెప్టెన్సీ ఎంత పెద్ద బాధ్యతో గిల్కు ఇంకా తెలియదు: దినేశ్ కార్తిక్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 20 , 2025 | 05:05 AM