నిఖత్కు రజతం
ABN, Publish Date - Jul 02 , 2025 | 05:20 AM
జాతీయ ఎలీట్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్లు మూడు పతకాలు కొల్లగొట్టారు. హైదరాబాద్లోని...
నిహారికకు కాంస్యం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ఎలీట్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్లు మూడు పతకాలు కొల్లగొట్టారు. హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు మంగళవారం ముగిశాయి. రైల్వేస్ జట్టు 9 పతకాలతో ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ 48 కిలోల విభాగం ఫైనల్లో గాయం కారణంగా ప్రత్యర్థికి వాకోవర్ ఇవ్వడంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 60 కి., కేటగిరీలో తెలంగాణకు చెందిన గోనెల్ల నిహారిక, 65 కిలోల విభాగంలో యషి శర్మ కాంస్యాలు సాధించారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 02 , 2025 | 05:21 AM