ఢిల్లీ ఫ్రీస్టయిల్ చెస్కు స్పాన్సర్లు కరవు
ABN, Publish Date - Jun 27 , 2025 | 05:48 AM
స్పాన్సర్లు ముందుకు రాకపోవడంతో భారత్లో జరగాల్సిన ప్రతిష్ఠాత్మక ఫ్రీస్టయిల్ చెస్ టోర్నమెంట్ తరలి పోనుంది....
న్యూఢిల్లీ: స్పాన్సర్లు ముందుకు రాకపోవడంతో భారత్లో జరగాల్సిన ప్రతిష్ఠాత్మక ఫ్రీస్టయిల్ చెస్ టోర్నమెంట్ తరలి పోనుంది. ఈ భారత అంచె టోర్నమెంట్ సెప్టెంబరు 17 నుంచి 24 వరకు ఇక్కడ జరగాల్సి ఉంది. కానీ ఈ టోర్నీని స్పాన్సర్ చేసేందుకు దేశంలోని ఏ సంస్థా ముందుకు రాలేదట. దీంతో వరల్డ్ నెం.1 మాగ్నస్ కార్ల్సన్ ఆటను ప్రత్యక్షంగా చూడాలన్న భారత చెస్ అభిమానులకు నిరాశే మిగలనుంది. వివిధ అంచెలలో నిర్వహించే ఫ్రీస్టయిల్ చెస్ చాంపియన్షి్పలో..మూడు అంచెలు ముగిశాయి. కార్ల్సన్ 65 పాయింట్లతో టాప్లో ఉన్నాడు. భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి (16) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీలో జరగాల్సింది నాలుగో అంచె టోర్నమెంట్.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 27 , 2025 | 05:48 AM