IPL 2025: అహ్మదాబాద్లో ఐపీఎల్ ముగింపు వేడుకలు.. ఆరు గంటలకు ప్రారంభం..
ABN, Publish Date - Jun 03 , 2025 | 05:19 PM
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్-2025 ముగింపు దశకు చేరుకుంది. మధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ఫైనల్ దశకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్-2025 (IPL 2025) తుది అంకానికి చేరుకుంది. మధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ఫైనల్ దశకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి (PBKS vs RCB). ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ కొత్త విజేతను అందించబోతోంది (IPL Final).
ఫైనల్ మ్యాచ్ కంటే ముందు అహ్మదాబాద్లో ఐపీఎల్ ముగింపు వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులను ఈ కార్యక్రమంలో సన్మానించబోతున్నారు. అలాగే భారత సాయుధ దళాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ అధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు.
ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన కుమారులు శివం, సిద్ధార్థ్ మహదేవన్ పాల్గొనబోతున్నారు. అలాగే పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పించబోతున్నారు.
ఇవీ చదవండి:
గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!
బీసీసీఐ బాస్గా మాజీ జర్నలిస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 03 , 2025 | 05:19 PM