Home » Cricket news
కొత్త ఏడాది వేళ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి పెట్టిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోహ్లీ గతేడాది సెప్టెంబరులో చివరగా ఓ ఫొటో షేర్ చేశాడు. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి దిగిన చిత్రాన్ని పంచుకుంటూ.. చాలా రోజుల తర్వాత ఇలా అంటూ అభిమానులను పలకరించాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్లు అస్టన్ అగర్, అరోన్ హర్డీ ప్రయాణిస్తున్న ఉబర్ కారు రోడ్డుపై ఆగిపోయింది. దీంతో వారు ఆ కారును తోసుకుంటూ స్టేడియానికి చేరుకున్నారు. బిగ్బాష్లీగ్లో (Big Bash League) భాగంగా పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు ముందు వారు మైదానానికి చేరుకునే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ ధరించిన ప్రఖ్యాత ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ అభిమానుల కోసం వేలానికి అందుబాటులోకి వచ్చింది. బ్రాడ్మన్ తన కెరీర్లో చివరిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్లో పాల్గొన్న సమయంలో ధరించిన ఈ క్యాప్ వచ్చే ఏడాది జనవరి 26 వరకు వేలంలో ఉండనుంది.
విజయ్ హజారే టోర్నీ2025-26లో భాగంగా బుధవారం త్రిపుర, కేరళ మధ్య మ్యాచ్ జరిగింది. కేరళ జట్టు తరఫున విజ్ఞేష్ పుతుర్ బరిలోకి దిగి.. ఉదియన్ బోస్, స్రిదమ్ పాల్, స్వప్నిల్ సింగ్, సౌరభ్ దాస్, అభజిత్ సర్కార్, వికీల క్యాచ్లు అందుకున్నాడు. మొత్తం 6 క్యాచ్లు అందుకొని ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఒక మ్యాచ్లో ఓ ఆటగాడు ఆరు క్యాచ్లు అందుకోవడం ఇదే ప్రథమం.
2025లో టీమిండియా మొత్తం మీద 14 వన్డేలు ఆడింది. వాటిలో 11 మ్యాచ్ల్లో గెలిచి, కేవలం మూడింటిలో మాత్రమే ఓడిపోయింది. ఈ విజయాల్లో టీమిండియా బ్యాటర్లదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా టాప్ ఫైవ్ బ్యాటర్లు ఎవరో చూద్దాం
ఒడిశాకు చెందిన 25 ఏళ్ల స్వస్తిక్ సామల్ ఐపీఎల్ లో ఆడాలని కలలు కంటున్నాడు. అంతేకాక ఐపీఎల్లో ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతీసారి అతడికి నిరాశే ఎదురైంది. కట్ చేస్తే.. తాజాగా విజయ్ హజారే టోర్నీలో డబుల్ సెంచరీతో చెలరేగాడు.
సెలబ్రిటీలను చూసేందుకు వారి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తమ ప్రాంతంలోకి వస్తే.. ఎలాగైనా చూడాలనే ఆలోచనతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ బ్యాటర్ అభిమానులు.. ఏకంగా చెట్లు ఎక్కి.. తమ అభిమాన ప్లేయర్ ఆటను వీక్షించారు.
భారత యువ హిట్టర్ రింకూ సింగ్ వచ్చే ఏడాదిలో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఎంపికనై సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ హజారే టోర్నీ 2025-26లో తాజాగా శుభారంభం చేశాడు.
15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీ తరఫున విరాట్ , ముంబై తరఫున రోహిత్ ఆడనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ప్లేయర్లు ఆయా జట్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ ఇద్దరూ తమ జట్ల తరఫున తొలి రెండు మ్యాచ్లు ఆడనున్నారు.
ఈ ఏడాది భారత పురుషుల జట్టు రెండు మేజర్ టోర్నీలలో విజేతగా నిలిచింది. అలాగే మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ను ముద్దాడింది. ఇక, మహిళల అంధ జట్టు కూడా టీ20 ప్రపంచకప్ దక్కించుకుని క్రికెట్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.