Home » Cricket news
టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. ఓపెనర్ ఐదెన్ మార్క్రమ్ (110)తో పాటు ఇతర బ్యాటర్లు కూడా సమయోచితంగా రాణించి భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. 358 పరుగుల భారీ టార్గెట్ను సమష్టిగా ఊదేశారు.
టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దీటుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్ ఐదెన్ మార్క్రమ్ (110) భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 4 సిక్స్లు, 10 ఫోర్లతో సెంచరీ చేసి భారత బౌలర్ల గుండెల్లో గుబులు రేపాడు.
టెస్ట్, వన్డే సిరీస్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికాలు టీ-20 ఫార్మాట్లో తలపడబోతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ-20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్ కోసం సెలక్టర్లు తాజాగా టీమిండియా జట్టును ప్రకటించారు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ తాజాగా మరో సెంచరీ చేశాడు. రాయ్పూర్లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ వరుసగా రెండో సెంచరీ చేశాడు. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్లో 135 పరుగులు చేసిన కోహ్లీ.. అదే ఫామ్ను కొనసాగిస్తూ మరో శతకం బాదాడు.
కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా రెండో సెంచరీ సాధించాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా తొలి శతకంతో మెరిశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.
గైక్వాడ్, కోహ్లీ చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రాయ్పూర్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా బ్యాటర్లు చుక్కలు చూపించారు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. పడిక్కల్ మెరుపు శతకం దెబ్బకు కర్ణాటక జట్టు 145 పరుగుల తేడాతో తమిళనాడుపై ఘన విజయం సాధించింది.
నియోజకవర్గ కేంద్రమైన ధర్మవరంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఒక్కో ఓవర్కు ఒక్కో పందెం కాస్తున్నారు. పట్టణంలోని క్రీడా మైదానంలో జరిగే పోటీలు బెట్టింగ్లకు అడ్డాగా మారాయనే విమర్శలొస్తున్నాయి. ఇక్కడ జరిగే మ్యాచ్లో కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఉంటాయి. వివరాలిలా ఉన్నాయి.
అబుదాబీ టీ10 లీగ్2025 విజేతగా యూఏఈ బుల్స్ (UAE Bulls) నిలిచింది. నిన్న (నవంబర్ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్ స్టాల్లియన్స్పై 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్ 30 బంతుల్లో 98 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ వన్డేలో విరాట్ సెంచరీ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.