Home » Cricket news
భారత్, సౌతాఫ్రికా జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ టాస్ పడకుండానే రద్దైంది. పొగమంచు కారణంగా మ్యాచ్ ప్రారంభం కాకుండానే ముగిసింది. లక్నో నగరంతో పాటు మ్యాచ్ జరిగే స్టేడియాన్ని పొగమంచు కమ్మేయడంతో పలుమార్లు మైదానానికి వచ్చిన అంపైర్లు.. పరిస్థితిని పర్యవేక్షించి.. చివరకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐపీఎల్2026 మినీ వేలం పలువురు ప్లేయర్లకు కాసుల పంట పండించింది. ఈ వేలంతో ఓ ఎంపీ కొడుకు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ వేలంలో భారత అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా కోల్కతా జట్టు తమ పర్స్లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. ఆ జట్టు కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బోండీ బీచ్లోరెండు రోజుల క్రితం యూదుల హనుక్కా వేడుక లక్ష్యంగా ఇద్దరు దుండగలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికి వార్తల్లో నిలిచాడు. అతన్ని రూ.25.20 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ అతడు డకౌట్ అయ్యాడు.
ఐపీఎల్-2026 మినీ వేలంలో పలువురు అన్క్యాప్డ్ ఆల్ రౌండర్లు జాక్పాట్ కొట్టారు. పలువురు ఆటగాళ్లు వేలంలో భారీ ధర దక్కించుకున్నారు. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్ కోసం ముంబై, లఖ్నవూ, చెన్నై, రాజస్థాన్ పోటీపడ్డాయి.
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా మలేషియాతో జరిగిన మ్యాచ్లో యువ భారత్ 315 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు చేసింది. మలేషియా 93 పరుగులకే ఆలౌటైంది.
అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారీ ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న అతడిని దక్కించుకోవడం కోసం కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. చివరకు కేకేఆర్ గ్రీన్ను రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు సృష్టించాడు.
అండర్ 19 ఆసియా కప్ లో భాగంగా మలేషియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ చేశాడు. దీంతో అండర్ 19లో ద్విశతకం సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా ఈ 17 ఏళ్ల కుర్రాడు రికార్డు క్రియేట్ చేశాడు.
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న వైస్-కెప్టెన్ శుభ్మన్ గిల్కు విశ్రాంతి అవసరమని, చాలా రోజులుగా బెంచ్కే పరిమితమవుతున్న సంజూ శాంసన్కు తుది జట్టులో చోటు కల్పించాలని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.
యాషేస్ 2025-26 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య డిసెంబర్ 17న మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. కీలక ఆటగాడిపై వేటు వేసింది.