Home » Cricket news
విజయ్ హజారే టోర్నీ2025-26లో భాగంగా బుధవారం త్రిపుర, కేరళ మధ్య మ్యాచ్ జరిగింది. కేరళ జట్టు తరఫున విజ్ఞేష్ పుతుర్ బరిలోకి దిగి.. ఉదియన్ బోస్, స్రిదమ్ పాల్, స్వప్నిల్ సింగ్, సౌరభ్ దాస్, అభజిత్ సర్కార్, వికీల క్యాచ్లు అందుకున్నాడు. మొత్తం 6 క్యాచ్లు అందుకొని ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఒక మ్యాచ్లో ఓ ఆటగాడు ఆరు క్యాచ్లు అందుకోవడం ఇదే ప్రథమం.
2025లో టీమిండియా మొత్తం మీద 14 వన్డేలు ఆడింది. వాటిలో 11 మ్యాచ్ల్లో గెలిచి, కేవలం మూడింటిలో మాత్రమే ఓడిపోయింది. ఈ విజయాల్లో టీమిండియా బ్యాటర్లదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా టాప్ ఫైవ్ బ్యాటర్లు ఎవరో చూద్దాం
ఒడిశాకు చెందిన 25 ఏళ్ల స్వస్తిక్ సామల్ ఐపీఎల్ లో ఆడాలని కలలు కంటున్నాడు. అంతేకాక ఐపీఎల్లో ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతీసారి అతడికి నిరాశే ఎదురైంది. కట్ చేస్తే.. తాజాగా విజయ్ హజారే టోర్నీలో డబుల్ సెంచరీతో చెలరేగాడు.
సెలబ్రిటీలను చూసేందుకు వారి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తమ ప్రాంతంలోకి వస్తే.. ఎలాగైనా చూడాలనే ఆలోచనతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ బ్యాటర్ అభిమానులు.. ఏకంగా చెట్లు ఎక్కి.. తమ అభిమాన ప్లేయర్ ఆటను వీక్షించారు.
భారత యువ హిట్టర్ రింకూ సింగ్ వచ్చే ఏడాదిలో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఎంపికనై సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ హజారే టోర్నీ 2025-26లో తాజాగా శుభారంభం చేశాడు.
15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీ తరఫున విరాట్ , ముంబై తరఫున రోహిత్ ఆడనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ప్లేయర్లు ఆయా జట్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ ఇద్దరూ తమ జట్ల తరఫున తొలి రెండు మ్యాచ్లు ఆడనున్నారు.
ఈ ఏడాది భారత పురుషుల జట్టు రెండు మేజర్ టోర్నీలలో విజేతగా నిలిచింది. అలాగే మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ను ముద్దాడింది. ఇక, మహిళల అంధ జట్టు కూడా టీ20 ప్రపంచకప్ దక్కించుకుని క్రికెట్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.
టీమిండియా టీ20 జైత్రయాత్ర వెనుక బ్యాటర్ల కృషి ఎంత ఉందో, బౌలర్ల శ్రమ కూడా అంతే ఉంది. వివిధ దేశాలలో, వివిధ పరిస్థితుల్లో టీమిండియా బౌలర్లు నిలకడగా రాణించారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై పైచేయి సాధించారు.
ఉత్సాహవంతురాలిగా పేరు పొందిన జెమీమా ఈ లక్షణమే తన సూపర్ పవర్ అని అన్నారు. ఈ ఎనర్జీ ఎప్పుడు ఎలా వాడుకున్నామన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు.
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా రేపు(ఆదివారం) తుది పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ గా ఉంది. లీగ్ దశలో పాక్ను యువ భారత్ 90 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.