దేవరకొండ ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Dec 06 , 2025 | 08:35 PM
నల్గొండ జిల్లా, దేవరకొండలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభ జరిగింది. శనివారం జరిగిన ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. దేవరకొండ మున్సిపాలిటీ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
నల్గొండ జిల్లా, దేవరకొండలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభ జరిగింది.
శనివారం జరిగిన ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఈ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు.
దేవరకొండలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
దేవరకొండ మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
సభలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కలవని పరిస్థితి ఉండేదని..పాపం ఇప్పుడు ఇద్దరు సర్పంచ్ లు, నలుగురు వార్డు మెంబర్లను పిలిపించుకుని మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
మహిళలకు చెక్ అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Updated Date - Dec 06 , 2025 | 08:37 PM