CM Revanth Reddy : ఎస్ఎల్బీసీలో అవసరమైతే రోబోలను వాడుతాం.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ABN, Publish Date - Mar 03 , 2025 | 06:43 AM
ఎస్ఎల్బీసీ టన్నెల్ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటన కేస్ స్టడీగా తీసుకోవాలని అన్నారు. ఈ ఘటన ఓ విపత్తు.. ఓ ప్రమాదమని ఆయన తెలిపారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ క్రమంలో టన్నెల్లోకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులను ఆయన ఆరా తీశారు. అలాగే సహాయక చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని రాజకీయం చేయటం తగదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంట దగ్గర విలేకరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం వెంట మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు ఈ ప్రాజెక్టును పక్కనపెట్టిందని విమర్శించారు.
ఆ సమయంలో తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నానని.. అయితే ఈ ప్రమాద ఘటన స్థలికి వెళ్తామంటే నాటి ప్రభుత్వం ఎందుకు అనుమతించలేదని నిలదీశారు. పనులు చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తూ జరిగిన ఘటన ఇదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ కొనసాగాలని.. ఎస్ఎల్బీసీలో అవసరమైతే రోబోలను వాడుతామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
పనులు చేస్తున్న సంస్థకు గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు బిల్లులు చెల్లించలేదని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
పనులు చేస్తున్న సంస్థ విద్యుత్ బిల్లులు చెల్లించలేదని.. విద్యుత్ సరఫరా కూడా ఆపేశారని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోరింగ్ మిషన్కు విడిభాగాలు కూడా సమకూర్చలేదని చెప్పారు. పనులు చేస్తున్నప్పుడు అనుకోకుండా జరిగిన ప్రమాదం ఇదని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించిందని.. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
Updated Date - Mar 03 , 2025 | 06:52 AM