Home » Mahabubnagar
కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కర్ణాటకలోని అశోకపురం వెళ్లే డైలీ ఎక్స్ప్రెస్ రైలు వేగాన్ని ఆగస్టు 25 నుంచి పెంచుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ తెలిపారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2027 నాటికి ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందుకు భూసేకరణ, పునరావాస పనులు మిషన్ మోడ్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో నీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమీషన్లు దండుకొని ఒక్క ఎకరానికీ నీరు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును.. బెంగళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది.
పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల, ఎస్ఎల్బీసీ, సీతారామ ప్రాజెక్టులతో సమాన ప్రాధాన్యం ఇస్తామని వ్యాఖ్యానించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ఆదేశించారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. వైష్ణవి అనే యువతిని శనివారం రాత్రి గొంతుకోసి హత్య చేసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
మహబూబ్నగర్ జిల్లాలోని అడ్డాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మహబూబ్నగర్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లిలో జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడింది.
విజయవాడ-దువ్వాడ సెక్షన్లోని రాయనపాడు రైల్వేయార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.