APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్-4 ప్రారంభం..
ABN, Publish Date - Aug 09 , 2025 | 11:57 AM
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-4 టోర్నీ శుక్రవారం నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-4 టోర్నీ శుక్రవారం నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది.
కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రారంభ కార్యక్రమంలో సినీ నటుడు వెంకటేశ్, ఏసీఏ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్, క్రికెటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రలోని ప్రతిభ గల క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడం, ప్రోత్సహించడమే ఏపీఎల్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల క్రికెటర్లకు ఏపీఎల్ వేదికగా నిలుస్తుందన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని ఆంధ్రలోని క్రికెట్ టాలెంట్ గెలవాలన్నారు.
గత ప్రభుత్వంలోని కార్యవర్గం క్రికెటర్లతో ఆటలాడుకున్న నేపథ్యంలో ఏపీఎల్-4 టోర్నీలో కొత్త మార్పులు తీసుకువచ్చి ప్రతిభకు అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు.
దేశంలో క్రీడాకారుల్లో ప్రతిభకు కొదవ లేదని, తగిన ప్రోత్సాహం అందిస్తే ఊహించని ఫలితాలు సాధిస్తారన్నారు.
అనంతరం మరో ముఖ్య అతిథి, ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్తో కలిసి తొలి మ్యాచ్లో తలపడుతున్న అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్ జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకుని అభినందించారు.
ప్రారంభ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్, విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎం.శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవంలో సినీ నటి ప్రగ్యా జైస్వాల్ డ్యాన్స్ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.
విశాఖలో జరుగుతున్న ఏపీఎల్ సీజన్ 4 క్రికెట్ మ్యాచ్ను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థినిలు.
Updated Date - Aug 09 , 2025 | 11:57 AM