Home » Cricket
టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచులో రన్ తీస్తూ కింద పడ్డాడు. దీంతో అతడి పక్కటెముక విరిగినట్టు తెలుస్తోంది.
కోచ్లపై టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను కోచ్లు సరైన దిశలో తీర్చిదిద్దడం లేదని విమర్శించాడు.
జనవరి 9 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ 2026 కోసం ఎంఐ కొత్త జెర్సీని విడుదల చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐసీసీ తీసుకున్న నిర్ణయాల వల్ల టీ20 ప్రపంచ కప్ను ఎవరూ చూడరని తీవ్ర విమర్శలు గుప్పించాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లోనే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. బీసీసీఐకి ఓ సూచన చేశాడు. రో-కో ఉన్నన్ని రోజులు వన్డే సిరీస్లు పెంచాలని అన్నాడు.
టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్.. 2025 ఇచ్చిన జ్ఞాపకాల గురించి ఇన్స్టాలో పోస్టు పెట్టాడు. ఆ ఏడాది తనకు ఎంతో ప్రత్యేకమని, ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు వెల్లడించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
2025.. ముగింపుకి వచ్చేసింది. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. క్రీడా రంగంలో సీనియర్లకు ధీటుగా ఎంతో మంది యువ సంచలనాలను ఈ ఏడాది మనందరికి పరిచయం చేసింది. స్వర్ణ పతకాలను దేశానికి అందించిన వారెవరో.. వారు సాధించిన ఘనతలేంటో చూద్దాం..
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తనకు పదే పదే మెసేజ్ చేసేవాడంటూ బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖుషీ వివరణ ఇచ్చుకుంది. క్రికెటర్ సూర్య ఫ్రెండ్లీగానే మెసేజ్ చేసేవాడని, తమ మధ్య ఇతర రిలేషన్స్ ఏవీ లేవని స్పష్టత ఇచ్చింది.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్ వేదికగా ముంబయి, గోవా జట్లు తలపడుతున్నాయి. సర్ఫరాజ్ ఖాన్(157) భారీ శతకాన్ని నమోదు చేశాడు. 75 బంతుల్లో ఏకంగా 9 ఫోర్లు, 14 సిక్సులు బాదాడు. నిర్ణీత 50 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి గోవా జట్టుకు 445 పరుగలు లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జనవరిలో విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే అవకాశముందని సమాచారం. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందే వీరు విజయ్ హజారేలో ఆడనున్నారని తెలుస్తోంది.