ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు

ABN, Publish Date - Nov 23 , 2025 | 07:54 AM

భారతీయ కళా మహోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఆకట్టుకునే ప్రదర్శనలను ఇచ్చారు.

1/10

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని పురస్కరించుకుని పలు రాష్ట్రాలకు చెందిన వారు కళా ప్రదర్శనలను ఇచ్చారు.

2/10

రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలను ఇచ్చారు.

3/10

మొత్తం 250 మంది కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. వీరిలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.

4/10

సంప్రదాయ నృత్యరీతులతో పాటు ఢోల్ టాషా, లెజిమ్, కల్బేలియా, వంటి జానపద నాట్య రీతుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి

5/10

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ 2వ ఎడిషన్‌ను ప్రారంభించారు.

6/10

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, టెక్స్‌టైల్స్ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రపతి నిలయంలో తొమ్మిది రోజుల పాటు ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

7/10

ఈ మహోత్సవం ఈశాన్య రాష్ట్రాల కళావైభవానికి అద్దం పడుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పశ్చిమ రాష్ట్రాల కళాప్రదర్శనలు ఈసారి హైలైట్‌గా నిలిచాయని అన్నారు.

8/10

తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం, కళానైపుణ్యాల గొప్పదనాన్ని ఈ మహోత్సవం చాటిచెప్పిందని రాష్ట్రపతి అన్నారు.

9/10

భారత సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఈ ఈవెంట్ కల్పించిందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

10/10

ఈ ఈవెంట్ ద్వారా భారత దేశ సంస్కృతిపై యువతకు అవగాహన పెంచుకునే అవకాశం దక్కిందని కూడా రాష్ట్రపతి ముర్ము అన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 08:00 AM