శ్రీ భవాని దీక్షలు 2025.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
ABN, Publish Date - Dec 14 , 2025 | 09:26 AM
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులు, భవానీ మాలధారుల రద్దీ కొనసాగుతోంది. భవానీల రాకతో ఆలయ పరిసరాలు ఎరుపెక్కిపోయాయి. తెల్లవారుజామున అమ్మవారి నిత్యపూజల అనంతరం భవానీల దర్శనానికి అనుమతించారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులు, భవానీ మాలధారుల రద్దీ కొనసాగుతోంది.
భవానీల రాకతో ఆలయ పరిసరాలు ఎరుపెక్కిపోయాయి.
తెల్లవారుజామున అమ్మవారి నిత్యపూజల అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు.
నాల్గవ రోజైన ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఇంద్రకీలాద్రి ప్రధాన ఆలయం పుష్ఫాల అలంకరణతో అందంగా ముస్తాబైంది.
భవాని భక్తులరద్దీని ఆలయ చైర్మన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు.
పుష్పాలంకరణలో చూడ చక్కగా తయారైన ఆలయ ప్రాంగణం.
భవానీలు ప్రతీ నిత్యం పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుని దీక్షలు విరమిస్తున్నారు.
రకరకాల పువ్వులతో అందంగా ముస్తాబైన ప్రధానం ఆలయం.
వీఎంసీ కార్యాలయం, సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్లు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి.
గిరి ప్రదక్షిణ మార్గంలో పగటి వేళ కంటే రాత్రి వేళలో భవానీల రద్దీ అధికంగా ఉంటోంది.
Updated Date - Dec 14 , 2025 | 10:24 AM