ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: సౌదీకి వెళ్లిన కిషన్ రెడ్డికి నీరాజనం..

ABN, Publish Date - Jan 15 , 2025 | 07:13 PM

కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి మధ్యలో సౌదీ అరేబియా వెళ్లారు. ఖనిజ భవిష్యత్తుపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సమాజం కిషన్ రెడ్డికి నీరాజనం పలికింది.

Kishan Reddy in Saudi arabia

Kishan Reddy in Saudi arabia: కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సౌదీ అరేబియా వెళ్లారు. ఖనిజ భవిష్యత్తుపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సమాజం కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికింది. రియాధ్‌లో ప్రవాసీయులు బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సౌదీ అరేబియాలో భారతీయులు అందులో తెలుగు ప్రవాసీయులు కేవలం ఉపాధికి మాత్రమే పరిమితం కాకుండ వాణిజ్య, పరిశ్రమ రంగాలలో కూడా ఎదుగుతుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.


సంతోషంగా ఉంది: కిషన్ రెడ్డి

కుటుంబ సమేతంగా న్యూఢిల్లీలో సంక్రాంతి పండుగ జరుపుకొంటున్న తనను.. ప్రధాని నరేంద్ర మోదీ, వాణిజ్య మంత్రి పియూష్ గోయెల్‌ కలిశారని కిషన్ రెడ్డి చెప్పారు. తన ఇంట్లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, మంత్రి గోయెల్.. భారత్-సౌదీ అరేబియా మధ్య సంబంధాల పటిష్ఠతలో తన పర్యటన ముఖ్యమని చెప్పారని గుర్తు చేశారు. ఈ కారణంగా పండుగ మధ్యలోనే తాను సౌదీకి రావాల్సి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయితే, మిగిలిన సంక్రాంతిని తోటి తెలుగు వారి మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

సౌదీలోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘం సాటా సెంట్రల్ ప్రతినిధులు రంజీత్, ముజ్జమ్మీల్, సుచరిత, ఆనందరాజు, పోకూరి ఆనంద్, శివారెడ్డి, సత్తిబాబు, జానీ బాషా, నాగార్జునలతో పాటు తెలుగు కళా క్షేత్రం అధ్యక్షులు రేవల్ అంథోని, విజయ చౌదరి, తెలుగు అసోసియెషన్ ఆఫ్ సౌదీ అరేబియా (తాసా) అధ్యక్షుడు స్వర్ణ తిరుపతి స్వామి, ఉర్దూ టోస్ట్ మాస్టార్స్ ప్రతినిధులు మోబీన్, వాసీఫ్ హైదరాబాద్ నగరానికి చెందిన ప్రవాసీ ప్రముఖలు సుల్తాన్ మజ్హరోద్దీన్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రవాసీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

తొలిసారిగా..

20 నిమిషాల పాటు ప్రసంగించి మంత్రి వెళ్ళిపోతారని నిర్వహకులు ప్రకటించినా తెలుగు వారి అప్యాయతతో రెండు గంటల పాటు కిషన్ రెడ్డి అందరితో కలిసి మెలిసి గడిపారు. తొలిసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక కేంద్ర మంత్రి సౌదీకు వచ్చి ఆత్మీయంగా గడపడం అనందం కలిగించిందని అనేక మంది తెలుగు ప్రవాసీయులు ఈ సందర్భంగా పెర్కోన్నారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ ఎంబసీ సౌజన్యంతో రియాధ్ లోని హైదరాబాద్ నగరానికి చెందిన వ్యాపారవేత్త మోహమ్మద్ నయీమోద్దీన్ నిర్వహించారు.

Updated Date - Jan 16 , 2025 | 09:39 AM