Home » NRI News
బహ్రెయిన్లో టీకేఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి.
సీనియర్ నాయకుడు కోమటి జయరాంని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర అమెరికాలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. రెండవసారి ఆయన ఈ పదవి ద్వారా సేవలు అందించనున్నారు..
అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో ఏపీకి చెందిన దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిశోర్ (45), ఆశ (40) వాషింగ్టన్లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. వీరి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
అమెరికాలో భారత సంతతికి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్లో ఉన్న కొలంబియాలో 27 ఏళ్ల నికితా గోడిశాల అనే యువతి గత వారం నుంచి కనిపించకుండా పోయింది. తాజాగా ఆమె మృతదేహం ఒకప్పటి స్నేహితుడు అర్జున్ అపార్ట్మెంట్లో లభ్యమైంది.
నెబ్రాస్కా తెలుగు సమితి (టీఎస్ఎన్) ఆధ్వర్యంలో తొలి యువజన సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించింది. 7వ తరగతి నుంచి కాలేజీ వరకు అనేక మంది భారతీయ అమెరికన్ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్లాసెంటియా నగరం వాలెన్సియా హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన లైట్ మ్యూజిక్ కచేరీ మంచి ఆదరణ దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సయ్యద్ నాజర్.. మౌలానా అబుల్ కలాం అజాద్ 2025 అవార్డు అందుకున్నారు. ఆయనకు ఎన్.ఆర్. ఐ టీడీపీ కువైట్ గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు శ్రీ వెంకట్ కోడూరి అధ్యక్షతన అభినందన సభ ఘనంగా జరిగింది
తానా (TANA) సౌత్ ఈస్ట్ యువ వాలంటీర్లు జార్జియాలోని కమింగ్లో ‘మీల్స్ బై గ్రేస్’ (Meals By Grace) ఫుడ్ బ్యాంక్కు మద్దతుగా నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం ఘనవిజయాన్ని సాధించింది.
పాత భవనాల్లో ఉండే 'ఆస్బెస్టాస్' వల్ల కార్మికులకు కలిగే ఆరోగ్య ప్రమాదాలను ఈ బృందం గుర్తించింది. దానికి పరిష్కారంగా ఒక అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థను ప్రతిపాదించింది. నిపుణుల సలహాలు తీసుకుంటూ.. క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి వీరు రూపొందించిన ఈ 'ఇన్నోవేషన్ ప్రాజెక్ట్' అందరి ప్రశంసలు అందుకుంది.
ఛార్లెట్లోని రూఫ్ అబోవ్ షెల్టర్ వద్ద ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో సుమారు 200 మందికి పిజ్జా, వింగ్స్, సోడాతో కూడిన ఆహారాన్ని అందించారు. దీనితో పాటు 1,000 పౌండ్ల బరువున్న 400 క్యాన్డ్ ఫుడ్ ఐటమ్స్ బ్యాగులను విరాళంగా అందజేశారు.