NRI: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గౌరు వెంకట్ రెడ్డికి ఎన్నారైల సత్కారం
ABN, Publish Date - Jul 17 , 2025 | 03:04 PM
అమెరికా పర్యటనలో ఉన్న టీడీపీ సీనియర్ నేత గౌరు వెంకట్ రెడ్డి పెన్సిల్వేనియాలో స్థానిక ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించారు.
ఎన్నారై డెస్క్: అమెరికా పర్యటనలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట్ రెడ్డిని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. అమెరికా పర్యటనలో భాగంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని చెస్టర్ స్ప్రింగ్స్ నగరంలోని ప్రవాసాంధ్రులతో సమావేశమైన గౌరు వెంకట్ రెడ్డి ఎన్నారైలను పాణ్యం నియోజకవర్గ అభివృద్ధిలో సహకరించాలని కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాణ్యం నియోజకవర్గాన్ని మెగా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేస్తోందని, ఎమ్మెల్యే గౌరు చరిత నాయకత్వంలో పాణ్యం నియోజకవర్గం హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కీలకపాత్ర పోషించనుందని అన్నారు. ఎన్నారైలు తమ నైపుణ్యం, పెట్టుబడులతో ముందుకు వచ్చి తమవంతు పాత్ర పోషించాలని కోరారు.
కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్, తానా బోర్డు సభ్యుడు పొట్లూరి రవి నిర్వహించిన ఈ సమావేశంలో జగదీశ్ రెడ్డి అనుముల, తానా రీజినల్ కోఆర్డినేటర్ ఫణి కంతేటి, మురళి రెడ్డి, బాలాజీ వీర్నాల, ప్రసాద్ కునారపు, హరి తుబాటి, రవి చిక్కాల, కోటి యాగంటి, సురేష్ యలమంచి, లక్ష్మీనరసింహా రెడ్డి కొండా తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈలో తెలుగు ప్రవాసీ సంఘాల రక్తదాన శిబిరం
డాలస్లో ఆకట్టుకున్న ‘అద్వైతం - డాన్స్ ఆఫ్ యోగా’ కూచిపూడి
Updated Date - Jul 17 , 2025 | 04:22 PM