ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: బాలభారతి పాఠశాల విద్యార్థులకు 10 లక్షల విరాళం

ABN, Publish Date - Aug 30 , 2025 | 07:56 AM

కర్నూలు జిల్లా బాలభారతి పాఠశాలకు ₹10 లక్షల విరాళాన్ని తానా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రవి పొట్లూరి అందించారు. శుక్రవారం ఆగస్టు 29 నాడు బాలభారతి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు రేంజి డిఐజి డాక్టర్ ప్రవీణ్ కోయా ₹10 లక్షల రూపాయల చెక్కును పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతికి అందజేశారు.

Balabharathi School Kurnool

ఇంటర్నెట్ డెస్క్: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్య సంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా ఆరవ సంవత్సరం ₹10 లక్షల విరాళాన్ని తానా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రవి పొట్లూరి అందించారు. శుక్రవారం ఆగస్టు 29 నాడు బాలభారతి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు రేంజి డిఐజి డాక్టర్ ప్రవీణ్ కోయా ₹10 లక్షల రూపాయల చెక్కును పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతికి అందజేశారు. అనాథ విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు తానా బోర్డు సభ్యులు, కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి తెలిపారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమవంతు సహకారం అందజేస్తామని, పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్న బాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమని, పొదుపు సంఘం మహిళలను అభినందిస్తున్నట్లు డీఐజీ డాక్టర్ ప్రవీణ్ కోయా తెలిపారు. పొట్లూరి రవి స్ఫూర్తితో ఎన్నారైలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఏఐఎస్, ఏపీఎస్‌కి అర్హత సాధించాలని, బాలభారతి పాఠశాలకు వస్తూ ఉంటానని తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. బాలభారతి పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందన్నారు. బాలభారతి పాఠశాల నుండి కౌంట్స్ అండ్ గైడ్స్‌లో రాజ్య పురస్కారానికి అర్హత సాధించి గవర్నర్‌తో ప్రశంసా పత్రం అందుకున్న విద్యార్థిని గీతను అభినందించి ఐదు వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు.

ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్న బాలభారతి పాఠశాలకు విచ్చేసిన అతిథులకు పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి ఆధ్వర్యంలో పొదుపు సంఘం మహిళలు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్న బాలభారతి పాఠశాలకు పొట్లూరి రవి మిత్రుల సహకారం మరువలేనిదని పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి తెలిపారు. స్వయంకృషితో ఎదిగి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సహకారం అందిస్తున్న ఎన్నారైలు అందరికీ ఆదర్శమని తెలిపారు. పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు.

ఎన్నారైల సహకారంతో జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్‍ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ తెలిపారు. పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని బాలభారతి పాఠశాల ప్రధానోపాద్యాయుడు కరస్పాండెంట్ సవ్య తెలిపారు. ఈ డిఎస్పీ బాబు ప్రసాద్, సిఐ చంద్రబాబు, ఎసై సునీల్ పొదుపులక్ష్మీ ఐక్యసంఘం కమిటీ కార్యవర్గం రత్నమ్మ, జుబేదా, సుమతి, సరస్వతి మరియు బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం..

ఫీనిక్స్ లో మినీ కన్వెన్షన్ గా సాగిన ఆటా డే

Read Latest and NRI News

Updated Date - Aug 30 , 2025 | 07:56 AM