Durga Navaratri 2025: నేటి అలంకారం శ్రీ దుర్గాదేవి
ABN, Publish Date - Sep 30 , 2025 | 03:29 AM
శరన్నవరాత్రి మహోత్సవాల్లో నేడు శ్రీ దుర్గాదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని...
దుర్గా నవరాత్రులు
నేటి అలంకారం శ్రీ దుర్గాదేవి
ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) మంగళవారం
శరన్నవరాత్రి మహోత్సవాల్లో నేడు శ్రీ దుర్గాదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని ఈ అష్టమి తిథి రోజునే సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ అష్టమిని ‘దుర్గాష్టమి’ అని వ్యవహరిస్తారు. ‘దుర్గే దుర్గతినాశని’... ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందనీ, కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలుగుతాయనీ, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందనీ నమ్మిక. ఆయురారోగ్యాలను ప్రసాదించే దివ్యరూపిణి దుర్గమ్మ దర్శనం సకల శ్రేయోదాయకం.
నైవేద్యం : గారెలు, చిత్రాన్నం
అలంకరించే చీర రంగు : ఎరుపు
వేటితో అర్చించాలి: గులాబీలు, ఎర్రటిపూలు, కుంకుమ,
ఎర్రటి అక్షతలు
పారాయణ: దుర్గా సూక్తం, దుర్గా సప్తశ్లోకి
ఇవి కూడా చదవండి
పాపం ఈ అమ్మాయి.. రోడ్డుపై గుంత ప్రాణం తీసింది..
దేశంలోని విస్కీ అమ్మకాల్లో 58శాతం దక్షిణ భారతంలోనే
Updated Date - Sep 30 , 2025 | 03:29 AM