Supreme Court India: జడ్జిల నియామకంలో జాప్యంపై విచారణ
ABN, Publish Date - Jul 25 , 2025 | 03:47 AM
జడ్జిల నియామకంపై కొలీజియం చేస్తున్న సిఫార్సులను ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం...
రెండు వారాల తర్వాత చేపట్టనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జూలై 24: జడ్జిల నియామకంపై కొలీజియం చేస్తున్న సిఫార్సులను ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపేందుకు గురువారం సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. రెండు వారాల తరువాత విచారణ చేపడుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్లను 2023లోనే లిస్టు చేశారని, అనంతరం ఆకస్మికంగా వాటిని జాబితా నుంచి తొలగించారని సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్స్టాప్లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News
Updated Date - Jul 25 , 2025 | 03:47 AM