Agra tragedy: రీల్స్ చేస్తూ నదిలో మునిగి ఆరుగురి మృతి
ABN, Publish Date - Jun 05 , 2025 | 04:35 AM
ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో విషాదం చోటుచేసుకుంది. యమునా నదిలో రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బాలికలు మృతి చెందారు.
ఆగ్రా, జూన్ 4: ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో విషాదం చోటుచేసుకుంది. యమునా నదిలో రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బాలికలు మృతి చెందారు. నలుగురు బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న ఇద్దరిని గ్రామస్థులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ వారు కూడా మరణించారు. బాలికలు నదిలోకి దిగడానికి ముందు ఒడ్డున వీడియోలు చిత్రీకరించినట్లు సాక్షులు తెలిపారు.
వారు నది సమీపంలోని పొలాల్లో పని చేస్తారని, వేడి నుంచి ఉపశమనం పొందేందుకు స్నానం చేయడానికి నదిలోకి వెళ్లారని అధికారులు పేర్కొన్నారు. ఆ ఆరుగురు బాలికలు ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి అకాల మరణం వారి కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Updated Date - Jun 05 , 2025 | 04:35 AM