Home » Uttar Pradesh
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ జరుగనుందనే ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్ర 6.30 గంటలకు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ను కలుసుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది.
నాలుగేళ్లుగా పుట్టింట్లో ఉంటున్న ఒక వివాహిత ఫేక్ ఐడీతో ఆన్లైన్లో భర్తతో చాటింగ్ ప్రారంభించింది. పరిచయం పెరగడంతో మహిళను కలుసుకునేందుకు వెళ్లిన భర్త అక్కడ భార్యను చూసేసరికి షాకైపోయాడు. యూపీలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.
ఓ కామాంధుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కాల్చి చంపేశారు. ఏడేళ్ల బాలుడిపై హత్యాచారం కేసులో ఎన్కౌంటర్ చేశారు.
ప్రియురాలిని, ఆమె కుటుంబాన్ని కంట్రోల్ చేయడం కోసం ఓ యువకుడు మాంత్రికుడిని ఆశ్రయించాడు. మాంత్రికుడి సాయంతో క్షుద్ర పూజలు చేయడానికి పూనుకున్నాడు. క్షుద్రపూజల కోసం ఏకంగా చితి నుంచి ఎముకలను సేకరించి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.
మందులో కలుపుకోవడానికి నీళ్లు తేలేదన్న కోపంతో 9 ఏళ్ల బాలుడిని బలితీసుకున్నాడు ఓ వ్యక్తి. ఇంట్లో శుభకార్యం జరుగుతున్న సమయంలో పిల్లాడిని తుపాకితో కాల్చి చంపేశాడు.
మృతదేహం లైన్లో ఉండడమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఉత్తరప్రదేశ్లో తాజాగా జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన కొరత చనిపోయిన వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా పక్కకు నెట్టింది.
ఆన్లైన్లో వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వివాహ వార్షికోత్సవానికి ఒక రోజు ముందు ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగు చూసింది.
బర్త్డే వేడుక సందర్భంగా ముఖానికి కేక్ పూశారన్న కోపంతో ముగ్గురు స్నేహితులను కాల్చి చంపిన నిందితుడు జీతూ సైనీ ఎన్కౌంటర్లో బలయ్యాడు. గురువారం ధారవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, నిందితుడికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
డీజే కారణంగా తన కోళ్ల ఫామ్లోని 140 కోళ్లు ప్రాణాలు కోల్పోయాయని ఫామ్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. డీజే ఆపరేటర్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లో బుధవారం చోటుచేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్లోని ఘజియాబాద్లో బుధవారం ఇందిరాపరంలోని గౌర్ గ్రీన్ అవెన్యూ హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..