Home » Uttar Pradesh
విరాళాల లెక్కింపు వ్యవస్థలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. విరాళాలు లెక్కించే సమయంలో సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు, ఇతర వ్యక్తిగత వస్తువులు ఉపయోగించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది.
భర్త కనబడడం లేదని 45 రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది.. చుట్టు పక్కల వారి దగ్గర రోజూ కన్నీళ్లు పెట్టుకునేది.. ఎంత ప్రయత్నించినా పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.. భార్య ప్రవర్తన మీద అనుమానం రావడంతో ఆమెను తమదైన శైలిలో విచారించారు..
చంపత్ రాయ్పై ‘ది బార్ అసోసియేషన్ ఆఫ్ ఫైజాబాద్’ లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయోధ్య జిల్లాలోని రామజన్మ భూమి పోలీస్ స్టేషన్లో చంపత్ రాయ్తో పాటు అనిల్ మిశ్రా, కృష్ణ దేవ్, గోపాల్ రావ్లపై కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో పోలీసులు నిందితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
వెనెజువెలాలో ఈ ఏడాది మే నెలలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్ కేసు సంచలనంగా మారింది.
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
అయోధ్య వివాదంలో చర్చల మార్గాన్ని సమర్థించిన మౌలనా సల్మాన్ నద్వీ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.
ఓ ఆకు కూరల వ్యాపారి ఆకు కూరల కట్టలను మురికి నీళ్లతో కడిగాడు. మురికి నీళ్లతో కడిగిన ఆ ఆకు కూరలను నేరుగా మార్కెట్కు తీసుకెళ్లి అమ్మకానికి పెట్టాడు.
అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాల అవకతవకలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. దేశ వ్యాప్తంగా ప్రజల సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని విరాళాలు వసూలు చేశారన్నారు.
అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంపై కొనసాగుతున్న వివాదం మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు.