Home » Uttar Pradesh
హనీమూన్లో నెలసరి వచ్చినందుకు తనపై భర్త దాడి చేశాడని ఓ మహిళ ఆరోపించింది. 2023లో ఈ ఘటన జరగ్గా పోలీసులు ఇన్నాళ్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొంది.
ప్రజారోగ్యం కాపాడే దిశగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తుల కల్తీకి పాల్పడే సంస్థలను మూసేసి, వాటి లైసెన్స్ రద్దు చేసేందుకు నిర్ణయించింది.
ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 21 తూటాలు ఉన్న అతని 7.62 ఎంఎం పిస్టల్ను తనిఖీ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకిలో మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పని నెట్టింట అందరినీ షాక్కు గురి చేసింది. ఏకంగా కొండచిలువను పట్టుకుని మెడలో వేసుకోవడం కలకలం రేపింది.
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కృత్రిమ పన్నీర్, నెయ్యి, కోవా ఉత్పత్తి, విక్రయాలపై సంపూర్ణ నిషేధం విధించింది. మిల్క్ ఫ్యాట్కు బదులుగా వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు ఉపయోగిస్తూ తయారుచేసే ఈ ఉత్పత్తుల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దొంగలు సాధారణంగా లక్ష్యంగా చేసుకున్న ఇంటిని నిమిషాల్లోనే దోచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆలస్యం చేస్తే ఎవరైనా చూస్తారేమోనని, ఇంటి యజమానులు వస్తారేమోనని భయపడుతుంటారు. అయితే, ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఇటీవల జరిగిన ఓ దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఉత్తర్ప్రదేశ్ మాజీ ఎంపీ, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు ఉమర్ అహ్మద్ అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నావాబ్గంజ్ టోల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో ప్రయాగ్రాజ్ పోలీసులు 28 మందిపై కేసులు నమోదు చేశారు.
రూ.44 లక్షల కోసం కట్టుకున్న భార్యను నలుగురు స్నేహితులతో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించాడు. పోలీసులు మొదట నిజమని భావించినప్పటికీ చివరికి గుట్టు రట్దైంది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విద్యార్థులతో నిర్వహించాల్సిన సమావేశానికి అనుమతి రద్దు కావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. తనను ఎవరూ అడ్డుకోలేరని, విద్యార్థుల సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ మృతి చెందారు. జైలులో ఉన్న తన సోదరుడిని కలిసేందుకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.