శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర 22కు వాయిదా
ABN, Publish Date - Jun 19 , 2025 | 03:28 AM
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది
న్యూఢిల్లీ, జూన్ 18: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ రోదసీ యాత్ర ఈ నెల 19న ఉంటుందని ఇస్రో ఇటీవల ప్రకటించింది. కానీ.. దీన్ని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్టు యాక్సియం స్పేస్ బుధవారం వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఇప్పటికే ఈ మిషన్ పలుమార్లు వాయిదా పడింది. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉంది. వాతావరణం అనుకూలించక వాయిదా పడింది.
Updated Date - Jun 19 , 2025 | 03:28 AM