Cholapuram Temple: గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రార్థనలు
ABN, Publish Date - Jul 27 , 2025 | 03:36 PM
చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ I జయంతి సందర్భంగా ఇవాళ తమిళనాడులో తిరువతిరై ఉత్సవం వైభవంగా సాగుతోంది. ప్రధాని మోదీ గంగైకొండ చోళపురం ఆలయంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి హాజరయ్యారు.
అరియలూర్ (తమిళనాడు)జూలై 27: చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ I జయంతి సందర్భంగా ఇవాళ తమిళనాడులో తిరువతిరై ఉత్సవం వైభవంగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగైకొండ చోళపురం ఆలయంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ప్రధాని సాంప్రదాయ దుస్తులైన తెల్లటి ధోతి, తెల్ల చొక్కా, మెడలో ధరించే అంగవస్త్రంతో ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని స్థానిక పండితులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రాజేంద్ర చోళ I (1014-1044 CE) భారత చరిత్రలో అత్యంత శక్తివంతమైన, దార్శనిక పాలకులలో ఒకరు. అతని నాయకత్వంలో, చోళ సామ్రాజ్యం దక్షిణ ఇంకా ఆగ్నేయాసియా అంతటా విస్తరించింది. తన విజయ యాత్రల తర్వాత గంగైకొండ చోళపురాన్ని సామ్రాజ్య రాజధానిగా స్థాపించాడు. ఆయన అక్కడ నిర్మించిన ఆలయం 250 సంవత్సరాలకు పైగా శైవ భక్తి, స్మారక నిర్మాణం, పరిపాలనా నైపుణ్యానికి ప్రతీకగా ఉంది.
అంతకుముందు, తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తిరుచిరాపల్లి జిల్లాలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానికి ఘన స్వాగతం లభించింది. గంగైకొండ చోళపురం ఆలయానికి వస్తున్న క్రమంలోనూ ప్రధానికి తమిళనాడు ప్రజలు రోడ్ కు ఇరువైపులా నిల్చుని జయ జయ ధ్వానాలు చేశారు.
ఇవి కూడా చదవండి:
వలసలపై ట్రంప్ హెచ్చరికలు.. ఈ ఆక్రమణను అడ్డుకోవాలని ఐరోపా దేశాలకు పిలుపు
హమాస్పై మండిపడ్డ ట్రంప్.. వారి పని ముగించేయాలంటూ ఇజ్రాయెల్కు సూచన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 27 , 2025 | 03:54 PM