ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Madras High Court : ఆన్‌లైన్‌ గేమ్స్‌ నియంత్రణ చట్టం సబబే

ABN, Publish Date - Jun 04 , 2025 | 05:54 AM

తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్‌ గేమ్స్‌ను క్రమబద్ధీకరించడానికి తీసుకొన్న చట్టాన్ని మద్రాసు హైకోర్టు చెల్లుబాటు చేయడం ఆమోదించింది. గోప్యత హక్కు ఉన్నా, సమాజానికి హాని కలగకుండా వ్యక్తిగత గోప్యతలో కొన్ని పరిమితులు అవసరమని కోర్టు పేర్కొంది.

మద్రాసు హైకోర్టు తీర్పు

చెన్నై, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ గేమ్స్‌ను క్రమబద్ధీకరించడానికి తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటవుతుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. 2022లో ఆన్‌లైన్‌ జూదాలు, క్రీడలను క్రమబద్ధీకరించడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపొందించింది. ఆ చట్టంలోని అంశాలను గత ఫిబ్రవరి 14న ప్రభుత్వ గెజిట్‌లో వెలువరించింది. ఆ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఆన్‌లైన్‌ క్రీడలు ఆడేందుకు ఆధార్‌ నెంబర్‌ అనుసంధానం చేయాలని పేర్కొంటూ.. అర్ధరాత్రి 12 నుంచి వేకువజాము 5 గంటల వరకు ఆన్‌లైన్‌ క్రీడలు ఆడటంపై నిషేధం విధించారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆన్‌లైన్‌ గేమ్స్‌ సంస్థల తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. మంగళవారం తీర్పు వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటు అవుతుందని తేల్చిచెప్పింది. గోప్యత ప్రాథమిక హక్కే అయినా ఆ హక్కు సంపూర్ణం కాదని, సమాజానికి హాని కలుగుతుంది కనుక వ్యక్తిగతపరమైన గోప్యతలో జోక్యం తప్పనిసరి అవుతుందని స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:54 AM