‘ఉపాధి’ వ్యయంపై పరిమితి దారుణం: ఖర్గే
ABN, Publish Date - Jun 17 , 2025 | 06:22 AM
పేదల జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం ‘ఎక్స్’లో ఆరోపించారు.
న్యూఢిల్లీ, జూన్ 16: పేదల జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం ‘ఎక్స్’లో ఆరోపించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ వ్యయంపై కేంద్రం పరిమితి విధించిందని, ఇది ‘రాజ్యాంగ వ్యతిరేకం’ అని విమర్శించారు. ఉపాధి హమీ పథకం వ్యయాన్ని ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు 60 శాతంగా నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. పేదల జేబుల నుంచి రూ.25 వేల కోట్లు దోచుకొనేందుకు మోదీ ప్రభుత్వం ఇలా చేస్తోందా? అని ఖర్గే ప్రశ్నించారు.
Updated Date - Jun 17 , 2025 | 06:28 AM