Home » Mallikarjun Kharge
మాటలను వక్రీకరించటం, ప్రజల మధ్య మతచిచ్చు రగల్చ టం మీకు అలవాటుగా మారింది. ఈ విధమైన మాటలతో మీరు ప్రధాని పదవికున్న ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు’ అంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుంటే.. కనీసం తన అంత్యక్రియలకు హాజరుకావాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓటర్లను కోరారు.
కాంగ్రెస్ పార్టీ నేత శామ్ పిట్రోడా వంశపారంపర్య పన్ను వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీపై బీజేపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. బుధవారం కేరళలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తొసిపుచ్చారు. బీజేపీ వాళ్లు ఆరోపిస్తున్నట్లు ఆ ఉద్దేశ్యం తమకు లేదన్నారు.
దేశ సంపదన, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోసిపుచ్చారు. 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన నగలను విరాళంగా ఇచ్చారని చెప్పారు.
ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీలోని పలువురు నాయకులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పీడ్కు బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రాకూండా అడ్డుకట్టవేసేందుకు విపక్ష ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఏడు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. నేతలు తమ మాటలకు మరింత పదును పెట్టారు. ఓటర్లను ఆకర్షించడం కోసం రకరకాల హామీలు ఇస్తూనే.. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతివిమర్శలతో వాగ్వాదానికి దిగుతున్నారు. తాజాగా ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా సైనిక స్కూళ్లను 'ప్రైవేటుపరం' చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారంనాడు ఒక లేఖ రాశారు. సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇందుకు సంబంధించి చేసుకున్న ఎంఓయులను రద్దు చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు. శుక్రవారం బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునే విధంగా మేనిఫెస్టోలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నేడు కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ( Lok Sabha Elections ) మేనిఫెస్టోను విడుదల చేయనుంది.