ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

VIT Graduation: జ్ఞాన విస్తరణకు పుస్తకాలు కీలకం

ABN, Publish Date - Aug 17 , 2025 | 05:58 AM

జ్ఞాన విస్తరణకు పుస్తకాలు ఎంతో కీలకం. విద్యార్థులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు అభ్యాసాన్ని కొనసాగించాలి’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ సూచించారు.

  • సమగ్రత లేని విజయం నిజమైనది కాదు

  • వీఐటీ 40వ స్నాతకోత్సవంలో సుప్రీం జడ్జి మహదేవన్‌

వేలూరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ‘జ్ఞాన విస్తరణకు పుస్తకాలు ఎంతో కీలకం. విద్యార్థులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు అభ్యాసాన్ని కొనసాగించాలి’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ సూచించారు. శనివారం వేలూరులోని వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) 40వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ‘విశ్వాసం, క్రమశిక్షణ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. నైతిక ప్రవర్తన, చర్యలను నిలబెట్టేందుకు, అంతర్గత మనస్సాక్షిని పెంపొందించుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తాయి. వీఐటీ తన విద్య, పరిశోధన, పరిపాలనా విధుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించింది. పేద, గ్రామీణ వర్గాలకు అండగా నిలబడడం కొనసాగించాలి. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం, తిరుక్కురళ్‌ గురించి ప్రస్తావించిన విషయాన్ని ఉటంకిస్తూ.. నిపుణులుగా మారడానికి విలువల పరిజ్ఞానం చాలా అవసరం. సమగ్రత లేని విజయం నిజమైన విజయం కాదు’ అని అన్నారు.

అవినీతి నిర్మూలనకు విద్యార్థులు పోరాడాలి: కులపతి విశ్వనాథన్‌

‘భారత జీడీపీలో 6 శాతం విద్యకు కేటాయించాలన్నది దీర్ఘకాలిక డిమాండ్‌. ప్రస్తుతం 3 శాతమే వ్యయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన రూ.55 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్యకు 2.5 శాతమే కేటాయిస్తోంది’ అని వీఐటీ వ్యవస్థాపకులు, చాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ, ‘మనం పన్ను ఎగవేత వల్ల ఏటా రూ.8-9 లక్షల కోట్లు, అవినీతివల్ల రూ.6లక్షల కోట్లు కోల్పోతున్నాం. ఈ సమస్యలను నిర్మూలించడానికి విద్యార్థి సమాజం పోరాడాలి’అని పిలుపునిచ్చారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో శివకుమార్‌ సుందరం, వీఐటీ ఉపాధ్యక్షుడు శంకర్‌ విశ్వనాథన్‌, శేఖర్‌ విశ్వనాథన్‌, జీవీసెల్వం, ట్రస్టీ రమణి బాలసుందరం, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంధ్య పెంటారెడ్డి, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాదంబరి ఎస్‌.విశ్వనాథన్‌, వీసీ వీఎస్‌ కాంచన భాస్కరన్‌, అసోసియేట్‌ వీసీ పార్థసారథి మల్లిక్‌, రిజిస్ట్రార్‌ టి.జయభారతి పాల్గొన్నారు. కార్యక్రమంలో ‘అబ్దుల్‌ కలాం, జగదీశ్‌ చంద్రబోస్‌’ పేర్లతో నిర్మించిన 2 భవనాలను ప్రారంభించారు. పీహెచ్‌డీ డిగ్రీ పొందిన వారిలో తమిళనాడు పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ డీజీపీ సందీప్‌ రాయ్‌ రాథోడ్‌ కూడా వుండడం విశేషం.

ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌కు చైనా మంత్రి.. ఎందుకంటే..

రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 05:58 AM