India Pakistan conflict: 20 రోజుల్లో 9సార్లు చెప్పారు..
ABN, Publish Date - Jun 01 , 2025 | 05:00 AM
భారత్-పాక్ల మధ్య యుద్ధం ఆపానంటూ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ ఎం దుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ‘మిత్రుడు డొనాల్డ్ భాయ్’ చెబుతున్న మాటలపై మోదీ ఎందుకు..
మోదీ మౌనమెందుకో?: కాంగ్రెస్
భారత్-పాక్ల మధ్య యుద్ధం ఆపానంటూ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ ఎం దుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ‘మిత్రుడు డొనాల్డ్ భాయ్’ చెబుతున్న మాటలపై మోదీ ఎందుకు పెదవి విప్పడం లేదని అడిగింది. ‘‘20 రోజుల్లో ఇది తొమ్మిదోసారి. మూడు దేశాల్లోని మూడు నగరాల్లో డొనాల్డ్భాయ్ చెప్పిందే చెబుతున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన నాలుగు రోజుల యుద్ధాన్ని అమెరికా ఎలా ఆపిందో వివరించుకుంటూ వెళ్తున్నారు. భారత్-పాక్లను సమానంగా పరిగణిస్తున్నట్టు పునరుద్ఘాటిస్తున్నారు. దీనిపై మోదీ మాట్లాడడం లేదు’’ అని జైరాం రమేశ్ అన్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్లో కరోనా.. ఐసోలేషన్కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 03 , 2025 | 12:47 PM