Amit Shah: ఒక్క ఉగ్రవాదిని కూడా వదలం
ABN, Publish Date - May 02 , 2025 | 04:27 AM
పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని అమిత్ షా హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తరిమికొట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
న్యూఢిల్లీ, మే 1: పహల్గాంలో పర్యాటకులపై పాశవిక దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఎవర్నీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వారిని వెంటాడి పట్టుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో అసోం బోడో సమాజం నాయకుడు ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పహల్గాం దాడికి గట్టిగా బదులిస్తామని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News
Updated Date - May 02 , 2025 | 04:27 AM