ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Air India Plane crash: కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..

ABN, Publish Date - Jun 12 , 2025 | 06:15 PM

లండన్‌లో చదువుకుంటున్న తన కూతురిని చూసేందుకు విజయ్ రూపాని ఎయిరిండియా విమానంలో పయనమయ్యారు. విమానంలో ఆయన కూర్చున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. వేరే ప్రయాణికురాలు విమానంలో తన సీటులో కూర్చున్న విజయ్ రూపానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Gujarat Ex CM Last Picture

అహ్మదాబాద్‌ (Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన (Plane crash ) సంగతి తెలిసిందే. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ విమానంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని (Vijay Rupani) కూడా ఉన్నారు (Air India Plane crash).

లండన్‌లో చదువుకుంటున్న తన కూతురిని చూసేందుకు విజయ్ రూపాని ఎయిరిండియా విమానంలో పయనమయ్యారు. విమానంలో ఆయన కూర్చున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. వేరే ప్రయాణికురాలు విమానంలో తన సీటులో కూర్చున్న విజయ్ రూపానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమానం ఎక్కినట్టు నిర్థారించే ప్యాసింజర్ జాబితాలో కూడా ఆయన పేరు ఉంది. విమానంలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్ రూపాని చివరి ఫొటో ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, విమాన ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సంఘటనా స్థలానికి బయల్దేరారు. ప్రధాని మోదీ కూడా రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Air India Plane crash: అహ్మదాబాద్ విమాన దుర్ఘటన.. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడంటే..

నటి కల్పికకు ఊహించని షాక్..

For National News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 07:30 PM