Home » Ahmedabad
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా.. శిశువు కలర్, జెండర్ ఆధారంగా రేట్లను నిర్ణయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
ప్రయాణికులంతా క్షేమమేనని, వారి బ్యాగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. స్థాయీ బెదిరింపుల స్పందన ప్రోటాకాల్ ప్రకారం ఒక్కొక్కరినీ తనిఖీలు చేశామని, అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు.
చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టును అహ్మదాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఇందులో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ పతంగుల పండుగను ప్రారంభించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సబర్మతి నదీ తీరంలో ప్రధాని సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ను ప్రారంభించారు. ఈ వేడుకలో ప్రధాని మోదీతో పాటు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కూడా పాల్గొన్నారు.
అహ్మదాబాద్లో ఈ ఏడాది జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో నలుగురు ప్రయాణికుల కుటుంబ సభ్యులు తాజాగా అమెరికాలో బోయింగ్, హనీవెల్ సంస్థలపై దావా వేశారు.
ప్రస్తుతం ప్రధాని మోదీ జపాన్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్లో బుల్లెట్ ప్రాజెక్టు అంశం కూడా చర్చకు రానుంది. మరి ఈ బుల్లెట్ రైలు ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
వాషింగ్టన్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లతో ప్రమేయం లేకుండా ఇందుకు అవసరమైన మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుందని మోదీ భరోసా ఇచ్చారు. అహ్మదాబాద్ సోమవారం నాడు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.
మనం ఏమి కొనుగోలు చేసినా, ఎక్కడ కొనుగోలు చేసినా 'మేడ్ ఇన్ ఇండియా' వస్తువులను కొనడం, కచ్చతంగా అవి దేశవాళీ వస్తువులయ్యే చూసుకోవడం మన జీవితంలో ఒక భాగం కావాలని ప్రధాని మోదీ అన్నారు.
వివాదాస్పద పోస్టర్లపై డీసీపీ (ట్రాఫిక్ వెస్ట్) నీతా దేశాయ్ వివరణ ఇస్తూ, ఇది రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రచారం అని, మహిళల భద్రతకు సంబంధించినది కాదని అన్నారు. ట్రాఫిక్ పోలీసుల అనుమతి లేకుండా సత్కృతా గ్రూప్ ఈ పోస్టర్లు వేసిందని చెప్పారు.
తల్లి చర్మాన్ని కవచ కుండలంగా చేసుకుని ఆ ఎనిమిది నెలల బాలుడు ఎట్టకేలకు బ్రతికి బయటపడ్డాడు. ఎగిసిపడుతున్న మంటలు.. తీవ్రమైన వేడి, దట్టమైన పొగను లెక్క చేయక, తమ ప్రాణాల్ని రక్షించుకోవడమేకాదు, తన చర్మాన్ని దానంగా ఇచ్చి..