CEO Rajbabu: ఉద్యోగుల అంకితభావానికి కార్లు బహుమతి
ABN, Publish Date - Jun 13 , 2025 | 05:21 AM
దశాబ్దం పాటు తమ వద్దే పని చేసి, సంస్థ అభివృద్ధికి అహరహం కృషి చేసిన ఉద్యోగులకు చెన్నైలోని ‘అజిలిసియం’ అనే సంస్థ కార్లు బహుమతిగా అందజేసింది.
చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థ యజమాని ఉదారత
చెన్నై, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): దశాబ్దం పాటు తమ వద్దే పని చేసి, సంస్థ అభివృద్ధికి అహరహం కృషి చేసిన ఉద్యోగులకు చెన్నైలోని ‘అజిలిసియం’ అనే సంస్థ కార్లు బహుమతిగా అందజేసింది. లైఫ్ సెన్సెస్ పరిశ్రమకు అటానమస్ ఏజెంట్ ఎ1 భాగస్వామి అయిన ఈ సంస్థ దశమ వార్షికోత్సవం గురువారం జరిగింది. ఈ సందర్భంగా.. ఆది నుంచీ సంస్థలో అంకితభావంతో పని చేసిన 25 మంది ఉద్యోగులను గుర్తించి, హ్యుండాయ్ క్రెటా ఎస్యూవీ మోడల్ కార్లను అందజేసింది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో రాజ్బాబు మాట్లాడుతూ.. తమ సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు ఎంతో కృషిచేశారని, ఈ కార్లు తాము వారికిచ్చే బహుమతి కాదని, అది శాశ్వత విశ్వాసమని వ్యాఖ్యానించారు.
Updated Date - Jun 13 , 2025 | 05:23 AM