Ceasefire: థాయ్లాండ్, కాంబోడియా కాల్పుల విరమణ
ABN, Publish Date - Jul 29 , 2025 | 04:40 AM
థాయ్లాండ్, కాంబోడియా కాల్పుల విరమణకు అంగీకరించాయి. మలేషియా మధ్యవర్తిత్వంలో జరిగిన..
బ్యాంకాక్, జూలై 28: థాయ్లాండ్, కాంబోడియా కాల్పుల విరమణకు అంగీకరించాయి. మలేషియా మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చల్లో బేషరతుగా, తక్షణమే కాల్పుల విరమణకు ఇరుదేశాలూ అంగీకారం తెలిపాయి. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇబ్రహీం నివాసంలో సోమవారం జరిపిన చర్చల్లో కాంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్, థాయ్లాండ్ తాత్కాలిక ప్రధానమంత్రి ఫుంతం వెచయచాయ్లతోపాటు మలేషియాలోని చైనా, అమెరికా రాయబారులు కూడా పాల్గొన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవతో ఈ చర్చలు జరిగాయి’ అని మానెట్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్నాథ్
పహల్గాం దాడికి అమిత్షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..
Updated Date - Jul 29 , 2025 | 04:40 AM