Indian Astronaut Shubhanshu Shukla: శుభాంశు శుక్లా టీం రిటర్న్ జర్నీ స్టార్ట్స్..
ABN, Publish Date - Jul 14 , 2025 | 04:19 PM
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా రిటర్న్ జర్నీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఫస్ట్ స్టెప్ అయిన స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలోకి ప్రవేశించారు. అంతరిక్ష నౌక, ఇంకా ISS మధ్య ప్రస్తుతం డీప్రెషరైజేషన్ ప్రక్రియ జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత కీర్తి పతాకను అంతరిక్షంలో ఎగురవేసి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణమవుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతున్న స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో రేపు(మంగళవారం) భూమికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఆక్సియం-4 మిషన్లో భాగంగా శుక్లా అంతరిక్ష నౌకలోకి సురక్షితంగా ప్రవేశించారు. అనంతరం హాచ్ మూసివేయబడింది. శుక్లా, ఇతర సిబ్బంది లోపల స్థిరపడగానే డీప్రెషరైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది సాధారణంగా పూర్తి కావడానికి ఒక గంట సమయం పడుతుంది. అన్డాక్ చేయడానికి ముందు డ్రాగన్ అంతరిక్ష నౌక.. స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి స్పేస్ఎక్స్, నాసా బృందాలు సంయుక్తంగా తుది 'గో' లేదా 'నో-గో' పోల్ను నిర్వహిస్తాయి.
ఈ పోల్ తర్వాత బృందాలు అన్డాక్ సీక్వెన్స్ను ప్రారంభించడానికి అన్డాక్ కమాండ్ను పంపుతాయి. ఇది IST సాయంత్రం 4:30 గంటలకు షెడ్యూల్ చేయబడింది.
ప్రత్యేక వీడ్కోలు వేడుక
ఆదివారం ఎక్స్పెడిషన్ 73 నుంచి వచ్చిన వ్యోమగాములు, ఆక్సియం-4 సిబ్బందికి స్పేస్ స్టేషన్ లో ప్రత్యేక వీడ్కోలు వేడుకను నిర్వహించారు. ఈ ఆక్సియం-4 మిషన్ సిబ్బందిలో శుక్లా, కమాండర్ పెగ్గీ విట్సన్, ఇంకా ఇద్దరు మిషన్ నిపుణులు, పోలాండ్కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు ఉన్నారు. ఆక్సియం-4 మిషన్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే భారతదేశం, పోలాండ్, హంగేరీలు 40 సంవత్సరాలకు పైగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి
గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం
ఆ మూడు ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమే: దేవినేని
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 14 , 2025 | 05:20 PM