ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారు సృజనాత్మకంగా ఆలోచించి మీ ఆలోచనలను విజయవంతంగా అమలు చేస్తారు

ABN, Publish Date - Oct 13 , 2025 | 01:04 AM

నేడు రాశిఫలాలు13-10-2025 సోమవారం కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.

నేడు రాశిఫలాలు13-10-2025 సోమవారం కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భాగస్వామి వైఖరిలో మార్పు గమనిస్తారు. మధ్యాహ్నం నుంచి కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పరమశివుని ఆరాధించండి.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. సహోద్యోగులతో ఆనందంగా గడుపుతారు. ఒక కీలకమైన సమాచారం అందుకుంటారు. మధ్యాహ్నం తరువాత డ్రైవింగ్‌లో నిదానం పాటించాలి. శివాలయాన్ని దర్శించండి.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. చిన్నారులు ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. టెలివిజన్‌, విద్య, ఆడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం తరువాత ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. పరమేశ్వరుని ఆరాధన శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. మీ మనసు మార్పును కోరుకుంటుంది. బదిలీలు, మార్పుల విషయాలో మీ సంకల్పం నెరవేరుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. మధ్యాహ్నం తరువాత మానసిక ఆందోళనకు గురవుతారు. శివాలయాన్ని దర్శించండి.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్యాహ్నం తరువాత ఒక సమాచారం కలవరపెడుతుంది. పరమేశ్వరుని ఆరాధన శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. రుణాలు మంజూరవుతాయి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. మధ్యాహ్నం తరువాత ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. పరమేశ్వరుని ఆరాధన మేలు చేస్తుంది.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త వ్యూహాలు అనుసరించి లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతుతాయి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం. మధ్యాహ్నం తరువాత పెద్దల నుంచి మాటపడాల్సి వస్తుంది. శివాలయాన్ని దర్శించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, చర్చలకు అనుకూల సమయం. బంధుమిత్రులతో ఆనందం గడుపుతారు. ఆధ్మాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం తరువాత అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో ఆశాంతికి లోనవుతారు. పరమశివుని ఆరాధించండి.

ధనుస్సు ( నవంబరు 23 - డిసెంబరు 22 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక విషయాల్లో లక్ష్య సాధనకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. మధ్యాహ్నం నుంచి ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. పరమేశ్వరుని ఆరాధన శుభప్రదం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

వివాహ నిర్ణయాలకు అనుకూలం. జనసంబంధాలు విస్తరిస్తాయి. కీలక పదవులు లభిస్తాయి. బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ప్రభుత్వరంగ సంస్థలతో పనులు పూర్తవుతాయి. సంకల్పం నెరవేరుతుంది. మధ్యాహ్నం తరువాత సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. పరమేశ్వరుని ఆరాధించండి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

సహోద్యోగులతో చర్చలు ఫలిస్తాయి, హోటల్‌, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధ్యాహ్నం తరువాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. శివాలయాన్ని దర్శించండి.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పొదుపు పథకాలు లాభిస్తాయి. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయు. విద్యా విషయాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. మధ్యాహ్నం తరువాత ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పరమేశ్వరుని ఆరాధన మేలు చేస్తుంది.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 13 , 2025 | 01:07 AM