ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Markets: నాలుగో రోజు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 లాసింగ్ స్టాక్స్

ABN, Publish Date - Jan 08 , 2025 | 03:42 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీతోపాటు అన్ని ప్రధాన సూచీలు రెడ్‌లో ముగిశాయి. దీంతో మదుపర్లు కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు.

Stock Markets

దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) బుధవారం (జనవరి 8న) బలహీనంగా ప్రారంభమై, చివరకు కూడా భారీ నష్టాలతోనే ముగిశాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీతోపాటు సూచీలు మొత్తం రెడ్‌లోనే ముగిశాయి. ఈ నేపథ్యంలో NSE నిఫ్టీ 50 ముగింపులో 18.95 పాయింట్లు క్షీణించి 23,688.95 స్థాయికి చేరుకోగా, సెన్సెక్స్ 50.62 పాయింట్లు క్షీణించి 78,148.49 వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 367 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 599 పాయింట్లు పడిపోయింది. దీంతో మదుపర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు.


టాప్ 5 లాసింగ్ స్టాక్స్

అయితే వరుసగా స్టాక్ మార్కెట్లు నాలుగోరోజు పతనం కావడం విశేషం. ఈ క్రమంలో అపోలో హాస్పిటల్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాలతో ముగియగా, ONGC, TCS, రిలయన్స్, ITC, ఏషియన్ పెయింట్స్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ట్రెంట్ వరుసగా నాల్గో రోజు తక్కువగా ట్రైడైంది. ఈ క్రమంలో 52 వారాల గరిష్టం నుంచి 21% తగ్గింది. బుధవారం ఇంట్రా-డే డీల్స్‌లో BSEలో ట్రెంట్ షేర్లు 4 శాతం క్షీణించి రూ. 6,591కు చేరుకున్నాయి. అక్టోబర్ 14, 2024న తాకిన దాని 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.8,345.85 నుంచి 21 శాతం పడిపోయింది.


మరోవైపు ఈ స్టాక్స్ కూడా..

ఉదయం డాక్టర్ రెడ్డీ, ఓఎన్‌జీసీ, ఐషర్ మోటార్స్, రిలయన్స్, పవర్‌గ్రిడ్‌లు నిఫ్టీపై బుల్లిష్‌గా ఉన్నాయి. కాగా టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, విప్రో, ఎస్‌బీఐ లైఫ్‌లు అత్యధికంగా క్షీణించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 9 షేర్లు మాత్రమే గ్రీన్‌లో కొనసాగాయి. మిగిలిన 21 షేర్లు క్షీణించాయి. జొమాటోలో అతిపెద్ద క్షీణత నమోదైంది.

దీని తర్వాత అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, NTPC, HUL వంటి షేర్లు క్షీణతతో ట్రేడయ్యాయి. ఆటోమోటివ్ సెమీకండక్టర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన టాటా టెక్నాలజీస్, టెలిచిప్స్ తదుపరి తరం సాఫ్ట్‌వేర్-నిర్వచించిన వాహనాల (SDVలు) కోసం వాహన సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను విప్లవాత్మకంగా మార్చడానికి CES 2025లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించిన తర్వాత షేర్ ధరలో పెరుగుదల కనిపించింది.


మార్కెట్ ఎందుకు పడిపోయింది?

మిడ్‌ స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మార్కెట్ మూడ్‌ని పాడు చేశాయని నిపుణులు అన్నారు. రిలయన్స్, ఆయిల్ & గ్యాస్ షేర్ల బలం కారణంగా నిఫ్టీలో పతనం పరిమితమైంది. బలహీనమైన GDP అంచనాలు బ్యాంకింగ్ స్టాక్‌లలో అమ్మకానికి దారితీశాయి. కింగ్‌ఫిషర్ బీర్ తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)కి తక్షణమే బీర్ సరఫరాను నిలిపివేసినట్లు బుధవారం ప్రకటించింది.


ఇవి కూడా చదవండి:

SNACC: 15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. మార్కెట్లోకి కొత్త యాప్..


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ


Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..


Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 08 , 2025 | 04:00 PM