Home » Nifty
శుక్రవారం నాటి నష్టాల నుంచి కోలుకుంటూ, ఈ వారం మొదటి రోజైన సోమవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో దలాల్ స్ట్రీట్ ఈరోజు ఆరంభం నుంచే పటిష్ఠంగా సాగింది.
భారత ఈక్విటీ మార్కెట్లకు శుక్రవారం భారీ షాక్ తగిలింది. IT రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 607 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్లు కోల్పోయాయి.
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక రంగానికి సరికొత్త జవసత్వాలను అందించింది. హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 2 నెలల కనిష్టానికి పడిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ రెండు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన మార్కెట్ సూచీలు.. తర్వాత వరుస పతనాన్ని చవిచూస్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు, నిఫ్టీ 240 పాయింట్లకు పైగా నష్టపోయాయి.
ఈ ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తర్వాత అద్భుతమైన రికవరీ సాధించాయి. ప్రారంభంలో సెన్సెక్స్ దాదాపు 490 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్ల వరకు నష్టపోయినప్పటికీ, తర్వాత కొనుగోళ్ల మద్దతుతో ముందుకు సాగాయి .
భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతం(శుక్రవారం)ట్రేడింగ్ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పైకి కదిలాయి.
నిన్న భారీ లాభాలు, దాదాపు ఈ వారమంతా తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ వారాంతాన్ని(శుక్రవారం) స్వల్ప నష్టాలతో ముగించాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
ఇవాళ(గురువారం) భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 789 పాయింట్లు, నిఫ్టీ 277 పాయింట్లు పెరిగాయి. నిఫ్టీ 23,689 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 75,398 వద్ద ముగిశాయి. గత కొన్ని రోజులుగా నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఆపరేషన్పై చేసిన ఘాటు వ్యాఖ్యలు, పశ్చమాసియాలో ముదురుతున్న యుద్ధ భయాల వల్ల నేడు దలాల్ స్ట్రీట్ భారీ పతనాన్ని చవిచూస్తోంది.