Home » Sensex
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఆపరేషన్పై చేసిన ఘాటు వ్యాఖ్యలు, పశ్చమాసియాలో ముదురుతున్న యుద్ధ భయాల వల్ల నేడు దలాల్ స్ట్రీట్ భారీ పతనాన్ని చవిచూస్తోంది.
యావత్ ప్రపంచం ఎంతో ఆశతో ఎదురు చూసిన ఇవాళ్టి 'ట్రంప్' ప్రసంగం మార్కెట్లను వణికించింది. ఇరాన్ యుద్ధ సెగతో సూచీలు కుప్పకూలిపోయాయి. ట్రంప్ ప్రకటనకు ముందు లాభాల్లో ఉన్న గిఫ్ట్ నిఫ్టీ సూచీ, వెనువెంటనే 340 పాయింట్ల మేర పతనమైంది.
భారత స్టాక్ మార్కెట్లు 2026-27 ఆర్థిక సంవత్సరానికి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ గ్యాప్ అప్ తో మొదలై ఇన్వెస్టర్ల సంపదను అమాంతం పెంచేశాయి.
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్ల వరకు పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు మరోసారి పతనమయ్యాయి. రెండు రోజుల లాభాలకు బ్రేక్నిస్తూ నేడు భారీ నష్టాలను చవిచూశాయి.
గత రెండు రోజులుగా లాభాల్లో పయనించిన భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ సూచీ ఏకంగా 1,500 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 22,900 మార్కు చేరువలోకి వెళ్లింది. పెట్టుబడిదారుల సంపద కొన్ని గంటల్లోనే లక్షల కోట్లు పెరిగిపోయింది.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్ను భారీ దెబ్బ తీశాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు, చమురు సరఫరాపై పడే ప్రభావం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టించింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్లో నిఫ్టీ, సెన్సెక్స్ భారీ పతనాన్ని నమోదు చేశాయి.
నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఓపెన్ అయ్యాయి. ఒక పక్క మధ్యప్రాశ్చంలో యుద్ధం తారాస్థాయిలో ఉన్నా భారత మార్కెట్లు ఇవాళ ముందుకు సాగుతున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో మార్కెట్ గ్రీన్ గా కనిపిస్తోంది.
మధ్యప్రాచ్యంలో ఆయిల్ ప్లాంట్లపై జరుగుతోన్న దాడుల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ముడిచమురు ధరలు పెరగడం, గ్లోబల్ మార్కెట్ల పతనంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రూపాయి విలువ కూడా కనిష్టానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు.