ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: వరుస నష్టాలకు బ్రేక్.. 320 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

ABN, Publish Date - May 29 , 2025 | 04:22 PM

గత రెండ్రోజులుగా ఎదురవుతున్న కాస్త బ్రేక్ పడింది. గురువారం దేశీయ సూచీలు లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తుండడం, ప్రధాన షేర్లలో కొనుగోళ్లు దేశీయ సూచీలను నడిపించాయి.

Stock Market

గత రెండ్రోజులుగా ఎదురవుతున్న కాస్త బ్రేక్ పడింది. గురువారం దేశీయ సూచీలు లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తుండడం, ప్రధాన షేర్లలో కొనుగోళ్లు దేశీయ సూచీలను నడిపించాయి. దీంతో వరుసగా నష్టాలను చవిచూస్తున్న సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు లాభాలను ఆర్జించాయి (Business News).


బుధవారం ముగింపు (81, 312)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 250 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఉదయం కాసేపు లాభనష్టాలతో దోబూచులాడింది. ఆ తర్వాత ప్రధాన షేర్లలో అమ్మకాలు మొదలు కావడంతో లాభాల బాట పట్టాయి. గురువారం సెన్సెక్స్ 81, 106 - 81,816 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 320 పాయింట్ల నష్టంతో 81, 633 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 81 పాయింట్ల లాభంతో 24, 833 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో అదానీ పోర్ట్స్, ఎటర్నల్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఆసియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 315 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 129 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.50గా ఉంది.


ఇవీ చదవండి:

భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 04:22 PM