SEBI Chairman: మార్కెట్లో అక్రమాలను సహించం
ABN, Publish Date - Jul 06 , 2025 | 02:54 AM
స్టాక్ మార్కెట్లో అక్రమాలను ఏ మాత్రం సహించబోమని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. తమతో పాటు ఎక్స్ఛేంజీలు కూడా మార్కెట్పై నిఘా పెంచాయన్నారు. శనివారం నాడు బాంబే...
సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే
స్టాక్ మార్కెట్లో అక్రమాలను ఏ మాత్రం సహించబోమని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. తమతో పాటు ఎక్స్ఛేంజీలు కూడా మార్కెట్పై నిఘా పెంచాయన్నారు. శనివారం నాడు బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడు తూ.. ఆయన వ్యాఖ్యలు చేశారు. డెరివేటివ్ ట్రేడింగ్లో అక్రమ పద్ధతుల్లో రూ.వేల కోట్లు ఆర్జించిన అమెరికా ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ గ్రూప్ను సెక్యూరిటీ మార్కెట్ నుంచి నిషేధిస్తూ సెబీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెబీ చైర్మన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇతర విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ) కూడా జేన్ స్ట్రీట్ తరహాలో మార్కెట్ను కొల్లగొట్టే తరహా ట్రేడింగ్ వ్యూహాలను అనుసరించారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘మార్కెట్లో ఎలాం టి అక్రమాలనూ సహించేది లేదని మాత్రం నేను చెప్పగలను’’ అని పాండే అన్నారు.
ఇవి కూడా చదవండి
ఆస్తే లేనప్పుడు మనీలాండరింగ్ ఎక్కడిది?
పవర్ జోలికొస్తే... పవర్ పోతుంది
Updated Date - Jul 06 , 2025 | 02:54 AM