పోకో ఎఫ్7 5జీ స్మార్ట్ఫోన్
ABN, Publish Date - Jun 27 , 2025 | 05:03 AM
స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ పోకో.. మార్కెట్లోకి సరికొత్త 5జీ స్మార్ట్ఫోన్ పోకో ఎఫ్7 విడుదల చేసింది. భారత్లోనే తొలిసారిగా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ పోకో.. మార్కెట్లోకి సరికొత్త 5జీ స్మార్ట్ఫోన్ పోకో ఎఫ్7 విడుదల చేసింది. భారత్లోనే తొలిసారిగా 7,550 ఎంఏహెచ్ బ్యాటరీతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ప్రొడక్ట్ మేనేజర్ సచిన్ దేవ్ వెల్లడించారు. సిలికాన్ కార్బన్తో కూడిన ఈ బ్యాటరీ దీర్ఘకాలం సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్సెట్, 6.83 అంగుళాల స్ర్కీన్, 50 ఎంపీ సోనీ ఐమ్యాక్స్882 కెమెరాతో రెండు వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. 12 జీబీ రామ్, 256 జీబీ మెమరీతో కూడిన ఎఫ్ 7 ధర రూ.29,999గా ఉండగా 12 జీబీ రామ్ 512 జీబీ మెమరీతో కూడిన ఫోన్ ధర రూ.31,299గా ఉంది. జూలై 1న ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ ఫోన్ను విడుదల చేయనున్నట్లు సచిన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే.. పూర్తి చేశారా లేదా..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 27 , 2025 | 05:03 AM