సెబీతో కేసు సెటిల్మెంట్ కోసం ఎస్ఎన్ఈ రూ1400 కోట్లు ఆఫర్
ABN, Publish Date - Jun 26 , 2025 | 05:36 AM
పబ్లిక్ ఆఫరింగ్కు (ఐపీఓ) అడ్డంకిగా మారిన కో-లొకేషన్ కేసును పరిష్కరించుకునేందుకు ఎన్ఎ్సఈ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సెబీతో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న కేసును...
ముంబై: పబ్లిక్ ఆఫరింగ్కు (ఐపీఓ) అడ్డంకిగా మారిన కో-లొకేషన్ కేసును పరిష్కరించుకునేందుకు ఎన్ఎ్సఈ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సెబీతో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న కేసును సెటిల్ చేసుకునేందుకు ఎన్ఎ్సఈ ఏకంగా రూ.1,388 కోట్లు ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే గనుక నిజమైతే, చరిత్రలో సెబీతో ఏదైనా కంపెనీ కుదుర్చుకున్న అతిపెద్ద సెటిల్మెంట్ ఇదే కానుంది. ఎన్ఎ్సఈ సెటిల్మెంట్ అప్లికేషన్పై సెబీ చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తి ఒకరు వెల్లడించారు. సెబీ కూడా ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించేందుకు సుముఖంగా ఉందన్నారు. తద్వారా ఎన్ఎ్సఈ ఐపీఓకు మార్గం సుగమం కానుంది. ఐపీఓకు రావాలని 2016లోనే ప్రయత్నించిన ఎన్ఎ్సఈకి కో- లొకేషన్ వివాదానికి సంబంధించిన కేసులు ప్రధాన అడ్డంకిగా మారాయి.
ఇవీ చదవండి:
1600 కోట్ల పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్.. హెచ్చరించిన గూగుల్
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 26 , 2025 | 05:36 AM