8 నెలల కనిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి
ABN, Publish Date - May 29 , 2025 | 01:55 AM
దేశంలో పారిశ్రామికోత్పత్తి 8 నెలల కనిష్ఠానికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)...
న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామికోత్పత్తి 8 నెలల కనిష్ఠానికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 2.7 శాతానికి జారుకుంది. మాన్యుఫాక్చరింగ్, మైనింగ్, విద్యుత్ రంగాల పేలవ పనితీరు ఇందుకు కారణం. గత ఏడాది ఏప్రిల్లో ఐఐపీ 5.2 శాతంగా నమోదైంది. కాగా ఈ మార్చి నెల ఐఐపీని గతంలో ప్రకటించిన 3 శాతం నుంచి 3.9 శాతానికి పెంచింది. గత నెలలో తయారీ రంగ ఉత్పత్తి వృద్ధి 3.4 శాతానికి తగ్గగా.. మైనింగ్ ప్రొడక్షన్ 0.2ు క్షీణించింది.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్లో ఐఫోన్లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 30 , 2025 | 03:08 PM