Devotional: దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఈ ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి..
ABN, Publish Date - Jun 25 , 2025 | 03:06 PM
దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు కొన్ని ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి. లేదంటే, దేవునికి నైవేద్యం పెట్టినా ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు.
Astrology Tips: భారతీయ సంస్కృతిలో దేవునికి నైవేద్యం సమర్పించడం చాలా ముఖ్యం. నైవేద్యం సమర్పించడం వల్ల ఆ భగవంతుడు సంతోషిస్తాడని, భక్తులకు సంతోషాన్ని, శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్ముతారు. అయితే, భగవంతుడికి నైవేద్యం సమర్పించే విషయంలో పూజ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఆ నిబంధనలు పాటించకుంటే చేసిన పూజకు ఫలితం ఉండదు. కాబట్టి, దేవునికి సమర్పించాల్సిన నైవేద్యాలకు సంబంధించిన ముఖ్య నియమాలు ఏమిటో తెలుసుకుందాం..
నైవేద్యం అనేది భక్తితో దేవుడికి సమర్పించే ఆహారం. ఈ నైవేద్యం చాలా పవిత్రమైనది. ఇది దేవుడి అనుగ్రహాన్ని పొందే మార్గంగా భావిస్తారు. నైవేద్యం సమర్పించడం ద్వారా మన జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. నైవేద్యం అనేది భక్తితో, శుభ్రమైన పాత్రలో దేవునికి ఇష్టమైన వాటిని సమర్పించాలి. ఉదాహరణకు, వినాయకుడికి మోదకం, విష్ణువుకి పాలు, శివుడికి పంచామృతం సమర్పించాలి.
దేవుళ్ళకు నైవేద్యం పెట్టడానికి వెండి, ఇత్తడి, బంగారం లేదా మట్టి పాత్రలను ఉపయోగించాలి. నైవేద్యం తయారు చేయడానికి ఉపయోగించే అన్ని పదార్థాలు శుభ్రంగా ఉండాలి. నైవేద్యం పెట్టే ముందు, నైవేద్యం తయారు చేసేటప్పుడు రుచి చూడకూడదు. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు భక్తితో, శ్రద్ధతో ఉండాలి. పూజ ముగిసిన తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచండి.
Also Read:
బద్దకానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..
టాటూ ఉన్న వాళ్లు రక్తదానం చేయడం మంచిదేనా..
For More Lifestyle News
Updated Date - Jun 25 , 2025 | 03:36 PM