Tirumala: శేషాచల అడవుల్లో అగ్నిప్రమాదం
ABN, Publish Date - May 02 , 2025 | 05:45 AM
తిరుమల శేషాచల అడవిలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. చీకటి పడేసరికి మంటలు పెరిగి కుమారధారతీర్థం వరకు వ్యాపించే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
తిరుమల, మే 1(ఆంధ్రజ్యోతి): తిరుమల శేషాచల అడవుల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాపవినాశనంకు ఏడు కిలోమీటర్ల దూరంలోని తుంబుర తీర్థం, మొగిలిపెంట బీట్లో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. చీకటి పడేసరికి ఆ మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దట్టమైన అడవి కావడంతో సిబ్బంది అక్కడికి చేరుకోలేని పరిస్థితి. కుమారధారతీర్థం వరకు మంటలు వ్యాపించే అవకాశాలున్నాయని అటవీశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కుమారధార తీర్థం వైపు వస్తే తీసుకోవాల్సిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News
Updated Date - May 02 , 2025 | 05:45 AM