ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Waqf Land Lease Cancelled After Public Uproar: వక్ఫ్‌లో ఎట్టకేలకు దిద్దుబాటు

ABN, Publish Date - Apr 11 , 2025 | 04:56 AM

వక్ఫ్ భూములను వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వక్ఫ్‌బోర్డు లీజు నోటీసును రద్దు చేసింది. ప్రభుత్వం知らకుండా నిర్ణయం తీసుకున్న బోర్డు సీఈవోపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది

  • వక్ఫ్‌ భూముల లీజు నోటీసు రద్దు

  • సీఎం ఆదేశాలతో వక్ఫ్‌బోర్డు వెనక్కి

  • బోర్డు సీఈవోపై వేటు?

అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): భూములను వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనపై వక్ఫ్‌బోర్డు వెనక్కి తగ్గింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల నేపఽథ్యంలో ఈనెల 3వ తేదీన ఇచ్చిన లీజుదారుల ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) నోటీసు రద్దయింది. ఈ మేరకు వక్ఫ్‌బోర్డు సీఈవో బుధవారమే ప్రత్యేకంగా నోటీసు జారీ చేశారు. వ క్ఫ్‌బోర్డుకు 90వేల ఎకరాలు ఉన్నాయి. అందులో 30వేల ఎకరాలపైనే భూమి అన్యాక్రాంతమైంది. మిగిలిన భూమిని వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలని వక్ఫ్‌బోర్డు ఆలోచించింది. ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏమిటి? ఆ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోకుండానే వక్ఫ్‌బోర్డు సీఈవో నిర్ణయాలు తీసుకున్నారు. వక్ఫ్‌బోర్డులోని కొందరు పెద్దల సిఫారసుతో ఆ భూములను వాణిజ్య అవసరాలకు లీజులకు ఇచ్చేందుకు గాను ఆసక్తిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటీసు జారీ చేశారు. కానీ, అంతకు నాలుగు నెలల ముందే, ఆ భూములను ఎలాంటి వాణిజ్య అవసరాలకూ వాడొద్దని, కేవలం ముస్లిం వర్గాల సంక్షేమం, అభివృద్ధికే వినియోగించాలని ముఖ్యమంత్రి మైనారిటీ సంక్షేమశాఖను ఆదేశించారు. అయితే, ప్రభుత్వ అనుమతి లేకుండానే వక్ఫ్‌బోర్డు సీఈవో ఆ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుపై ముస్లిం వర్గాల నుంచే తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ముస్లిం సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన భూములను వాణిజ్య అవసరాలకు ఎలా వాడతారంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈనెల 9వ తేదీన ‘వక్ఫ్‌భూములకు ఎసరు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ఈ విషయాలను ప్రచురించింది.


ఆ వార్తలోని అంశాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆమోదం, అనుమతి లేకుండా ఆ నోటీసు ఎలా ఇచ్చారని అధికారులను మందలించారు. తక్షణమే నోటీసును రద్దుచేయాలని మైనారిటీ సంక్షేమశాఖను ఆదేశించారు. దీంతో నోటీసును వెనక్కి తీసుకోవాలని మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి చిత్తూరు శ్రీధర్‌ వక్ఫ్‌బోర్డుకు ఆదేశాలు జారీచేశారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి నివేదిక కోరారని తెలిసింది. ప్రభుత్వానికి తెలియకుండా నోటీసు ఇప్పించడంలో ఎవరి పాత్ర ఏమిటి? ఎవరి ప్రోద్బలం దీనివెనుక ఉందనేది ఆ నివేదికలో తెలపాలని మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే, ఈ పరిణామాల ప్రభావం వక్ఫ్‌బోర్డు సీఈవోపై పడనుంది. ఇప్పుడున్న అధికారి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి వక్ఫ్‌బోర్డుకు రెగ్యులర్‌ సీఈవోగా ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జాయింట్‌ సెక్రటరీ కేడర్‌లో ఉన్న ఐఏఎస్‌ కోసం అన్వేషిస్తున్నారు.

Updated Date - Apr 11 , 2025 | 04:56 AM