ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tenders for Visakha Metro: విశాఖ మెట్రో టెండర్లకు శ్రీకారం.. మూడు కారిడార్లలో 46.23 కిలోమీటర్లు

ABN, Publish Date - Jul 25 , 2025 | 02:40 PM

విశాఖపట్నం నగర ప్రజల ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు ఎట్టకేలకు గాడిలో పడుతోంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (AMRC) కొద్దిసేపటి క్రితం మెట్రో నిర్మాణానికి సంబంధించిన టెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Metro

విశాఖపట్నం: నగర ప్రజల ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు ఎట్టకేలకు గాడిలో పడుతోంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (AMRC) కొద్దిసేపటి క్రితం మెట్రో నిర్మాణానికి సంబంధించిన టెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్రధాన కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ఈ టెండర్లు పెట్టినట్లు అధికారులు తెలిపారు.

అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకారం, విశాఖ మెట్రోకు సంబంధించి మొత్తం మూడు కారిడార్లు రూపొందించారు.

కారిడార్ – 1:

  • విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు

  • దూరం: 34 కిలోమీటర్లు

  • ఇది ప్రధాన కారిడార్‌గా పేర్కొన్నారు. ఈ మార్గం విశాఖ నగరాన్ని తూర్పు నుంచి పశ్చిమ దిశగా అనుసంధానిస్తుంది.

కారిడార్ – 2:

  • గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు

  • దూరం: 5 కిలోమీటర్లు

  • ఈ మార్గం నగరంలోని మధ్య ప్రాంతాలను కవర్ చేస్తుంది.

కారిడార్ – 3:

  • తాడిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు

  • దూరం: 7 కిలోమీటర్లు

  • ఇది ఉత్తర భాగాన్ని మెట్రోతో అనుసంధానిస్తుంది.

మొత్తం 42 స్టేషన్లు..

ఈ మూడు కారిడార్లలో కలిపి మొత్తం 42 మెట్రోస్టేషన్లను నిర్మించనున్నట్లు AMRC వెల్లడించింది. ప్రతి స్టేషన్ను ఆధునిక సదుపాయాలతో, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించనుంది. ఈ మెట్రో ప్రాజెక్టును మూడు ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ దశలో టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ప్రత్యేక ఆకర్షణ – మెట్రోతో పట్టణాభివృద్ధి

ఈ మెట్రో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విశాఖపట్నం నగరం ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం పొందడంతోపాటు, మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయని నగర ప్రణాళిక వర్గాలు భావిస్తున్నాయి. మెట్రో రాకతో రియల్ ఎస్టేట్, వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా అభివృద్ధి చెందనున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News

Updated Date - Jul 25 , 2025 | 05:21 PM