PSR Anjaneyulu : పీఎస్ఆర్కు వైద్య పరీక్షలు
ABN, Publish Date - Jun 05 , 2025 | 06:07 AM
కొద్దిరోజులుగా తనకు బీపీలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయని, మధ్యమధ్యలో కళ్లు తిరుగుతున్నాయని జైలు అధికారులకు చెబుతున్నారు.
విజయవాడ, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్సఆర్ ఆంజనేయులుకు ప్రభుత్వాసుపత్రిలో బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్దిరోజులుగా తనకు బీపీలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయని, మధ్యమధ్యలో కళ్లు తిరుగుతున్నాయని జైలు అధికారులకు చెబుతున్నారు. దీంతో పీఎ్సఆర్ను జైలు అధికారులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు బీపీ, ఈసీజీ, మధుమేహం పరీక్షలు చేశారు. కొద్దిసేపు సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో పరిశీలనలో ఉంచారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 06:07 AM