ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fund Mismanagement : కాంట్రాక్ట్‌ కంపెనీలతో సంజయ్‌ కుమ్మక్కు

ABN, Publish Date - Jan 22 , 2025 | 05:35 AM

అగ్ని ఎన్‌వోసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ రూపకల్పన, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరాతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల ఏర్పాటు...

  • 1.75 కోట్ల నిధులు మళ్లించిన సీఐడీ మాజీ చీఫ్‌

  • దీనిపై ప్రాథమిక ఆధారాలున్నాయి

  • వాస్తవాల వెలికితీతకు కస్టోడియల్‌ విచారణ అవసరం

  • ముందస్తు బెయిల్‌ ఇస్తే దర్యాప్తుపై ఆ ప్రభావం

  • హైకోర్టుకు తెలిపిన ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌

  • సంజయ్‌ ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): అగ్ని ఎన్‌వోసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ రూపకల్పన, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరాతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల ఏర్పాటు పేరుతో సీఐడీ మాజీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌ కాంట్రాక్టు కంపెనీలతో కుమ్మకై నిధులు మళ్లించేశారని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మంగళవారం ఆయన వాదనలు వినిపించారు. రూ1.75 కోట్లు మేర నిధులను సంజయ్‌ దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అగ్ని యాప్‌ రూపకల్పనకు ఒప్పందం జరిగిన వారం రోజుల్లోనే హడావుడిగా సౌత్రికా టెక్నాలజీస్‌ సంస్థకు రూ.80 లక్షలు చెల్లించారని, యాప్‌ రూపకల్పన పురోగతిని పరిశీలించకుండానే సొమ్ము చెల్లించేశారని వివరించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై గిరిజనులు, దళితులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు క్రిత్వ్యాప్‌ సంస్థతో 2024 జనవరి 30న ఒప్పందం చేసుకున్నారని, ఆ రోజే ఆ సంస్థకు సొమ్ము చెల్లించేశారని తెలిపారు. క్రిత్వ్యాప్‌ సంస్థతో ఒప్పందానికి ముందే సీఐడీ అధికారుల నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారని, క్రిత్వ్యాప్‌ సంస్థ సదస్సులు నిర్వహించకుండానే బిల్లులు సమర్పించిందని పేర్కొన్నారు. ఈ రెండు సంస్థల నుంచి నిధులు సంజయ్‌కి చేరాయో?లేదో? దర్యాప్తులో తేలాల్సి ఉందని, సదస్సుల నిర్వహణ గురించి దిగువస్థాయి అధికారులను ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. వాస్తవాలు వెలికితీయాలంటే సంజయ్‌ కస్టోడియల్‌ విచారణ అవసరమన్నారు. సంజయ్‌కి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రభావితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తుబెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.


అంతకుముందు సంజయ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. అధికారుల నేతృత్వంలోని కమిటీ యాప్‌ రూపకల్పనపై సంతృప్తి వ్యక్తం చేసిన తరువాతే శాఖాధిపతి హోదాలో పిటిషనర్‌ నిధులను విడుదల చేశారని చెప్పారు. విధానపరమైన నిర్ణయాలలో జరిగే తప్పులకు పిటిషనర్‌ను బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. అప్పటి మార్కెట్‌ ధర కన్నా 5శాతం తక్కువకే ల్యాప్‌టా్‌పలు కొనుగోలు చేశారని తెలిపారు. దారి మళ్లిందని చెబుతున్న సొమ్ము పిటిషనర్‌కు చేరినట్లు ఆధారాలు లేవన్నారు. కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటామని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జసిస్‌ కె.శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా, వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్‌గా, అగ్నిమాపకశాఖ డీజీగా వ్యవహరించిన సంజయ్‌ 150 ట్యాబ్‌ల సరఫరా, అగ్ని ఎన్‌వోసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి ఒప్పందాన్ని సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు, అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై గిరిజనులు, దళితులకు అవగాహన సదస్సుల నిర్వహణ ఒప్పందాన్ని క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అప్పగించడంతోపాటు మోసపూరితంగా బిల్లులు చెల్లించడం ద్వారా రూ1.75కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాల ని కోరుతూ సంజయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ సంస్థ డైరెక్టర్లు, సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా డైరెక్టర్లు వేర్వేరుగా దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపైనా వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 05:35 AM